February 10, 2026 8:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేసీఆర్ స్కెచ్ ప్రకారమే.. జనసేన బరిలో ఉంటోందా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెరాసకు జీవనమరణ సమస్యలా తయారయ్యాయి. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల ఓటమిని తెరాస నేతలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దుబ్బాక ఓటమి గ్రీటర్ లో రిపీట్ అయితే ఇక కారు దూకుడుకు బ్రేకులు పడ్డట్టే. 

November 19, 2020 at 6:55 AM
in Latest News, Telangana
Pawan Kalyan & KCR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గ్రేటర్ ఎన్నికలు తెరాసకు కీలకంగా మారాయి. ఇక దుబ్బాకలో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ నేతలు గ్రేటర్‌లో పాగా వేయగలిగితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు చెక్ పెట్టవచ్చని ఆ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీల పేర్లే గ్రేటర్ ఎన్నికల బరిలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం పాతబస్తీలోని 40 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది డివిజన్లు గెలిచేది కష్టంగానే అనిపిస్తోంది.  ఆ పార్టీ నుంచి కీలక నేతల వలసలు కాంగ్రెస్ కు శాపంగా మారాయి. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక  టీడీపీ, జనసేన, వామపక్షలు, పోటీ చేస్తే వైసీపీ పార్టీలు ఖాతా తెరుస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా?

బీహార్ లో బీజేపీ అమలు చేసిన వ్యూహాన్ని  కేసీఆర్  గ్రేటర్ ఎన్నికల్లో అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో జట్టుకట్టిన జనసేనను గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి  దింపడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని భావించవచ్చు.  సెటిలర్లు, ముఖ్యంగా ఆంధ్రావారి ఓట్లు  తెరాసకు పడే అవకాశాలు తక్కువ. అందుకే వారి ఓట్లు బీజేపీ ఖాతాలో పడి వారి బలం పెరగకుండా, ఓట్లను చీల్చేందుకు జనసేనను ఒంటరిగా బరిలోకి దింపేలా కేసీఆర్ జనసేన అధినేతను ప్రోత్సహించారనే సమాచారం వస్తోంది. 

ఏపీలో ఒక్కసీటుకే పరిమితమైన జనసేన గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా దిగుతామంటూ తొడగొట్టడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. షూటింగుల్లో హడావుడిగా ఉన్న జనసేనాని రెండు రోజులు సినిమా షూటింగులు నిలిపేసుకుని మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం పెట్టుకున్నారు. నిజానికి ఈ సమావేశం ఇప్పట్లో జరగాల్సింది కాదు. హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పడానికే జనసేనాని మంగళగిరిలో అత్యవసర సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. 

అక్కడ నుంచే గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నామని ప్రకటించారు. ఏపీలో బీజేపీతో కలసి అడుగులు వేస్తున్న, జనసేనాని తెలంగాణలో మాత్రం తెరాసతో కుమ్మక్కయినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా తెలంగాణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని విశ్లేషణలు హల్ చల్ చేస్తున్నాయి. పాతబస్తీలో ఎంఐఎంతో జట్టుకట్టే తెరాస, సెటిలర్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో జనసేన ఓట్ల చీలిక ద్వారా గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతీరాలకు చేరాలని పార్టీలోని ప్రతి నేతనూ మోహరించారు. 

వనరులు పుష్కలంగా ఉన్న తెరాసకు నిజంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ దుబ్బాకలో ఎదురుదెబ్బలు, హైదరాబాద్ లో ఇటీవల వచ్చిన వరదలు తెరాస అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక గ్రేటర్ లో కూడా ఓడిపోతే మాత్రం కారు దూకుడుకు బ్రేకులు పడ్డట్టేనని భావించవచ్చు. 

Must Read ;- మేల్కొనకపోతే కాంగ్రెస్ కనుమరుగే..!

దూకుడు మీదున్న బీజేపీ

దుబ్బాక ఫలితాలతో తెలంగాణ బీజేపీ మంచి దూకుడు మీదుంది. గెలిచింది ఒక్క అసెంబ్లీ స్థానమైనా బీజేపీకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందని చెప్పవచ్చు. తెరాస ఏడేళ్ల పాలనపై ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించారు. అందుకే దుబ్బాకలో యువతోత్సాహంతోనే బీజేపీ అభ్యర్థి నెగ్గారు. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలను ఆకర్షించి, ఆ పార్టీ ఓట్లను కొల్లగొడ్డడం ద్వారా బీజేపీ నేతలు కనీసం 51 డివిజన్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

కేంద్ర బీజేపీ పెద్దల నుంచి కూడా అండాదండా లభించడంతో ఇక తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు భూపేంద్ర యాదవ్ ను అమిత్ షా రంగంలోకి దింపారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలో బీజేపీ గెలుపునకు వ్యూహాలు రచించి విజయవంతంగా అమలు చేసిన భూపేంద్ర యాదవ్ గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారో ఇప్పటికే అర్థమైంది. ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టిన రెండు రోజుల్లోనే గ్రేటర్ కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

ఇక టీడీపీ ఓట్లు కూడా బీజేపీ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ముఖ్యంగా సెటిలర్లకు సీట్లు ఇవ్వడం ద్వారా వారి ఓటు బ్యాంకు బీజేపీ ఖాతాలో పడేలా చూడాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణలోని బీజేపీ నేతలంతా గ్రేటర్ ఎన్నికలు అయ్యే వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని ఆ పార్టీ ఆదేశించింది. బీజేపీ సీనియర్ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండటంతో ప్రతి ఓటుపై గురిపెట్టారని తెలుస్తోంది.

కాంగ్రెస్ ఆశలు గల్లంతు

తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, తెరాస అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరిదారి వారిదే. ఎవరికి వారే గొప్ప నాయకులు. ఒకరిమాట ఒకరు వినే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక ఆ పార్టీలో ఎవరు ఉంటారో? ఎవరు బీజేపీలోకి వెళుతున్నారో అర్థం కాక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయోమయంలో పడిపోయారు. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో బిజీగా ఉండాల్సిన కాంగ్రెస్ అధ్యక్షుడు, చివరకు కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీ మారవద్దని బతిమాలు కోవాల్సి దుస్తితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది డివిజన్లు సాధిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, తెరాసను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ లో తురుపు ముక్కలు కూడా లేవు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు గట్టిగా ప్రశ్నించగలరు. కానీ ఆయనకు ఆ పార్టీ నేతలే బ్రేకులు వేస్తూ ఉంటారు. చివరకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళుతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఇక తెలంగాణ కాంగ్రెస్ పని అయిపోయినట్టే.

సింగిల్ సీటు వస్తుందా? ఈ పార్టీలకు..

టీడీపీ, జనసేన, వైసీపీ, వామపక్షాలు వీరంతా గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. టీడీపీ గత గ్రేటర్ ఎన్నికల్లోనే దారుణంగా దెబ్బతింది. మరోసారి అదృష్ణాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే, అసలు ఆ పార్టీకి గ్రేటర్‌లో ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. లేదంటే సెటిలర్ల ఓట్లు చీల్చి తెరాస పార్టీ  అభ్యర్ధులు కొన్ని డివిజన్లలో గెలిచేందుకు సహాయపడుతుంది. ఇక వామపక్షాల జెండా ఎత్తేవారే కరవయ్యారు. ఇక వైసీపీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వైసీపీని కూడా తెరాస అధినేత రంగంలోకి దింపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అలాంటివి మరి. ఏది ఏమైనా గ్రేటర్ పోరు ఆ మూడు పార్టీ మధ్యే సాగనుంది.

Also Read ;- గులాబీ బాస్ గ్రేటర్ ప్లాన్..  కమలనాథులకు చెక్

Tags: AIMIMbhupender yadavbjpcongressdubbaka bypoll elections 2020GHMC Elections 2020greater hyderabad municipal corporationshome minister amit shahjanasena with trskcr strategyleotoppawan kalyan in ghmc electionsRevanth Reddytdptelangana bjptelangana congressTelangana Politics
Previous Post

కరోనా టెస్టుల ధరలు తగ్గింపు

Next Post

ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనవరి నుంచి షూటింగ్

Related Posts

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

by లియో డెస్క్
February 9, 2026 7:40 pm

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ...

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

by లియో డెస్క్
February 9, 2026 2:16 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే...

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

by లియో డెస్క్
February 7, 2026 7:18 pm

జగన్‌ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన...

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

by లియో డెస్క్
February 6, 2026 1:45 pm

కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం...

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

by లియో డెస్క్
February 5, 2026 7:24 pm

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్‌ బాబాయ్‌.....

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

by లియో డెస్క్
February 4, 2026 7:58 pm

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం...

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

by లియో డెస్క్
February 2, 2026 1:21 pm

సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత...

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

Actress Pragathi Latest Pics Going Viral

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

పోలవరానికి జగన్ గ్రహణం… 4ఏళ్లలో 4% పనులు కూడా చేయరా..? చంద్రబాబు హయాంలో 72% పనుల పూర్తి.. 24గంటల్లో 32,500క్యూమీ కాంక్రీటు గిన్నెస్ రికార్డు.. భారీ వాహనాలు, వేలాది కార్మికులతో కోలాహలం…ఆ స్ఫూర్తి ఇప్పుడేది..? ఏ ముఖం పెట్టుకుని పోలవరం వెళ్తున్నారు జగన్మోహన రెడ్డి..?

మధుర కంఠశాల .. మన ఘంటసాల

ముఖ్య కథనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist