జగన్ రెడ్డి పార్టీకి పాడే కట్టేందుకు ఆ నలుగురు చాలు..!
అధికార వైసీపీకి ఏపీలో రోజులు దెగ్గరపడ్డాయి. అందుకు ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యతిగత దూషణలతో హర్ట్ చేయాలని చూస్తున్నారు. పోయిన ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో వెలగపూడి ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని పట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగారు. తెలుగు ప్రజల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె, ఒక సంప్రాదాయ గృహిణి అని కూడా చూడకుండా నిండు సభలో ఆమె వ్యక్తిగత హననానికి పాల్పడుడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులలు! ఈ వ్యాఖ్యాలను సభలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వింటూ.. చిరుమందహాసంతో వేడుక చూశారు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ బాగానే గమనించారు. తండ్రిపై ఉన్న అభిమానంతో జగన్ ఒక్కఛాన్స్ అంటూ ప్రాధేయపడుంటే ప్రజలు సానుభూతి చూపారు. ‘‘నేడు ఆ సానుభూతే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేసింది! ఆ సానుభూతే యువత, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది!! ఆ సానుభూతే కొత్తకొత్త భూతులను భావితరాలను పరిచయం చేసేలా చేసింది! ఆ సానుభూతే.. అన్ని రంగాలను కూల్చింది!’’ వీటన్నీంటికి తోడూ..రాజకీయ సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని మరిచి మంత్రులు కొడాలి, అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, అంబటి వాడే బూతులు వింటే పరాకాష్టకు నెక్స్ట్ లెవల్ అనిపించేలా ఉన్నాయి! ఆ నలుగురు వాడే కర్ణకఠోర పదజాలం వింటూ ఇలాంటి బజారు వ్యక్తులనా, మేము జగన్ మోహం చూసి ఓటు వేసింది అని నేడు ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఏపీలో రాజకీయాలను 2019 ఎన్నికలకు ముందు, ఆ తరువాత అన్నట్లు విభజించి చూడాల్సి వస్తోంది! ఆ నలుగురు ప్రజాప్రతినిధులు వాడే పదజాలం తీవ్ర అభ్యతరకరం! దీనిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపై చేయాల్సిన రాజకీయ విమర్శలు మరిచి, వ్యక్తిగత హననానికి, దూషణలకు పాల్పడుతున్నారు. ఆ రోజు నిండుసభలో లోకేశ్ పుట్టుకను ప్రశ్నించారు. భువనేశ్వరిపై లేనిపోని కట్టు కథలు అల్లి వ్యక్తిగత హనానికి పాల్పడ్డారు. అది మరవకమునిపే మరోసారి లోకేశ్ వ్యక్తిగత హననంపై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలకు గొడ్డాలిపెట్టువంటివి! దీనిని రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో గమనిస్తునే ఉన్నారు.
రాజకీయ విమర్శలు చేయలేక వక్తిగత దూషణలు!
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెలుగు దేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేక.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు! ఎందుకంటే ఆయనగారు చేస్తున్న రేషన్ మాఫియాను ఆధారాలతో తెదేపా బయటకు లాగి, విమర్శలు గుప్పించి, ప్రశ్నించిన నేపథ్యంలో ప్రతిపక్షంపై మండి ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కొవాలి.. అంతేకాని చేతకాని దద్దమ్మల్లా పర్సనల్ కామెంట్స్ చేయడం ఏమిటని తెలుగు దేశం నాయకులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. ద్వారంపూడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారం ఉంది కదా అని నేడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే.. మీరు ఎక్కడో కూర్చుకుని మీడియా ముందు సంస్కారహీనంగా మాట్లాలను.. తిరిగి మీ ఇంటి ముందుకొచ్చి మరి మాట్లాడే పరిస్థితి తెచ్చుకొవద్దని హెచ్చరిస్తున్నారు. ఏపీ సంస్కృతిపై విషం చిమ్మె వైసీపీ రాజకీయాలను ప్రజలు చీదరించుకుంటు న్నారు. ఒక్కసారి మీరు మాట్లాడే భాషను మీకు భార్య, పిల్లలు ఉంటే వారిని అడగండి.. మాట్లాడే పదజాలంలో ఎంతటి బజారుతనంగా ఉంటుందో వారే చెబుతారని మహిళలు మండిపడుతున్నారు. నిన్న కాకినాడలో మీడియా సమావేశం పెట్టి మరి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నారా లోకేశ్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. వ్యక్తి గతాన్ని హరించేలా వ్యాఖ్యలు చేశారు. ‘నారా లోకేశ్ ను నాయుడు అనాలో ఏమనాలో నాకైతే తెలియడం లేదంటూ అంటూ ద్వారంపూడి లోకేశ్ పై చేసిన పర్సనల్ అసాసినేషన్ వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది! తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును, ఆ పార్టీ నాయకులను రాజకీయంగా ఎదుర్కొవడం చేతకాక, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నోర్లు సరిచేసుకోకుంటే వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి!
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!