యంగ్ హీరో నాగశౌర్య , టాలెంటెడ్ హీరోయిన్ రీతూవర్మ జంటగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘వరుడు కావలెను’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయం అవుతూ రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే డబ్బింగ్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది.
ఉగాది కానుకగా ‘వరుడు కావలెను’ టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా డబ్బింగ్ మొదలైంది. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య హీరో నాగశౌర్యతోనూ, హీరోయిన్ రీతూ వర్మ తోనూ డబ్బింగ్ చెప్పిస్తూండడాన్ని ట్విట్టర్ లో రివీల్ చేశారు మేకర్స్.
లాస్టియర్ అశ్వథ్ధామతో సాలిడ్ హిట్ కొట్టిన నాగశౌర్య ఈ ఏడాది వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా లక్ష్య, క్రైమ్ థ్రిల్లర్ గా పోలీస్ వారి హెచ్చరిక, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ‘వరుడు కావలెను’ మూవీస్ ను లైన్ గా ట్రాక్ ఎక్కించాడు. వీటిలో ముందు గా విడుదలయ్యేది ‘వరుడు కావలెను’ మూవీ. ఆ తర్వాత మిగతా సినిమాలు విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు నాగశౌర్య. మరి ‘వరుడు కావలెను’ సినిమా శౌర్యకి ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ట్రెడిషనల్ గా.. రాధికా శరత్ కుమర్, నాగశౌర్య
The wedding clan has started their dubbing work 💫#VaruduKaavalenu Teaser Soon @IamNagashaurya @riturv @LakshmiSowG @Composer_Vishal @navinnooli @vamsi84 @ganeshravuri @murlisharma72 @SitharaEnts pic.twitter.com/xgVh7ui9f4
— BARaju (@baraju_SuperHit) April 4, 2021