ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్ చల్ చేసేస్తోంది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ చిత్రంలో నటించడానికి రంగం సిద్ధమైందని. ఇటీవల ప్రశాంత్ నీల్.. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ ను కలిసి.. స్టోరీ డిస్కస్ చేశాడట. దాంతో ఇప్పుడు వీరిద్దరి కలయికలో భారీ చిత్రానికి బీజం పడిందని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్… యశ్ తో ‘కేజీఎఫ్ 2’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే.. మరో చేత్తో ప్రభాస్ తో ‘సలార్’ సినిమాను కూడా ట్రాక్ మీద పెట్టుకున్నాడు. ఇక ఈ రెండింటి తర్వాత.. యన్టీఆర్ తో సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయితేనే గానీ ప్రశాంత్ .. అల్లు అర్జున్ సినిమాను ఇప్పట్లో మొదలుపెట్టలేడు.
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఈ సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ బజ్ నెలకొంది. ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న ‘పుష్ప’ సినిమా ను సుకుమార్ ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ కన్ను ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడిందని చెప్పుకుంటున్నారు. యన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్.ఆర్. ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు. ఈ లెక్కన చూస్తే.. ప్రశాంత్ త్వరలో రామ్ చరణ్ తో కూడా సినిమా తీస్తాడని చెప్పు కోవచ్చన్నమాట.
Must Read ;- అల్లు దంపతుల ఆనంద చుంబనం @ తాజ్ మహల్











