పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాథేశ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా నిరాశపరచడంతో ‘రాధేశ్యామ్’ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటలీలో ప్రభాస్, పూజా హేగ్డే ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది.

రెబల్ స్టార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కథను మలుపు తిప్పే పాత్ర అని సమాచారం. అయితే.. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. రిలీజ్ గురించి చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న సినిమాల టార్గెట్ సమ్మరే. అందుకే సమ్మర్ లో సినిమాల రిలీజ్ లకు పోటీ ఎక్కువుగానే ఉంటుంది. మెగాస్టార్ ‘ఆచార్య’, బాలయ్య, బోయపాటి సినిమా, చైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. ఇలా చాలా సినిమాలు సమ్మర్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
అందుకే ‘రాధేశ్యామ్’ రిలీజ్ ఎప్పుడు అనేది అభిమానులకు సస్పెన్స్ గా ఉంది. తాజా వార్త ఏంటంటే… ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ మూవీ రిలీజ్ డేట్ ను సంక్రాంతికి ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ కి ముహుర్తం ఖాయమైంది.. !











