మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రవితేజ – శృతిహాసన్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలు సమ్మర్ కి వాయిదాపడడంతో ఈ సినిమా కూడా వాయిదా పడుతుందేమో అనుకున్నారు కానీ.. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు డైరెక్టర్ మలినేని గోపీచంద్ కన్ ఫర్మ్ చేశారు.
ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . దేవదాసు, మస్కా తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో… ఈ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.
ఇస్మార్ట్ శంకర్ కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, రెడ్ కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. అన్ని థియేటర్స్ లోను ట్రైలర్ ప్రదర్శితమవుతూ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల చేయనున్నాం అని నిర్మాత స్రవంతి రవి కిషోర్ చెప్పారు. దీంతో రవితేజ క్రాక్, రామ్ రెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. మరి.. ఈ పోటీలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
Must Read ;- ఆకాష్ పూరికి రామ్ మాట సాయం..!