ములుగు ఎమ్మెల్యే సీతక్క.. లాక్ డౌన్ సమయంలో సీతక్క చూపిన చొరవతో దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు. కాలికి గాయమైనా..పేదలకు సేవా కార్యక్రమాలు ఆపలేదు. ప్రజల్లో ఉంటూ..ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా పేరున్న సీతక్క.. ఇటీవల ట్వీట్ల రూపంలో అధికార పక్షాలకు పంచ్లు విసురుతున్నారు. నిన్న సీతక్క చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది.
‘2021లో సెంచరీ ఎవరు కొడతారు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి’..?అనే ప్రశ్నకు సీతక్క తన పంచ్ విసిరారు. వీటికంటే ముందు పెట్రోల్ ధర సెంచరీ కొడుతుందని ట్వీట్ చేశారు.
పాకిస్తాన్లో రూ.46, శ్రీలంకంలో రూ.63, బంగ్లాదేశ్లో రూ.77, భారతదేశంలో రూ.90 ఉందని, ఈ విషయాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో చెబుతారా అని పరోక్షంగా బీజేపీ శ్రేణులపై సెటైర్ వేశారు. అదే సమయంలో జీడీపీ బంగ్లాదేశ్లో 5.2శాతం, పాకిస్తాన్లో (- 0.4)శాతం, శ్రీలంకలో (- 5.5)శాతం, భారత్లో (-8)శాతం ఉందని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ పాలనపై..
గత కొన్ని రోజులుగా సీతక్క దేశవ్యాప్తంగా బీజేపీ పాలనపై పలు ట్వీట్లు చేశారు. డిసెంబరు 19న యూపీ సీఎం యోగిని ఉద్దేశించి మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక డిసెంబరు 18న మరో ఆసక్తికర ట్వీట్ చేశారు సీతక్క. రైతుల సమస్యల విషయంపై ట్వీట్ చేశారు సీతక్క. పిల్లలకు శాంతాక్లాజ్ గురించి చెప్పి నమ్మించే ముందు.. మోదీజీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల విషయం గుర్తు చేసుకోవాలని ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, మరి మీరు అని ప్రశ్నించారు సీతక్క. ఈ ట్వీట్లతో పాటు ఫొటోలను, కార్టూన్లను జత చేసి మరీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సీతక్క. రైతులకు రూ.70వేల కోట్ల రుణ మాఫీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే.. కార్పొరేట్లకు రూ.6.6లక్షల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందని , మోదీ ప్రభుత్వం చేస్తున్న మాయల నుంచి దేశం బయటకు రావాలని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దును ఉద్దేశించి ‘Too much of Democracy ’ అని ట్వీట్ చేశారు. ఓవైపు రైతుల ఆందోళన కొనసాగుతుంటే పార్లమెంటు సమావేశాలు రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. 2016లో నోట్ల రద్దు కారణంగా ప్రజలు రోడ్లపైకి రాగా 2019లో విద్యార్థులు, CAA ఆందోళనకారులు పోరాటం చేశారని, 2020జూన్లో వలస కార్మికులు రోడ్డెక్కారని, డిసెంబరులో రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. మోదీ జీ క్షేత్ర స్థాయి పాలన ఇది అని ట్వీట్ చేశారు.
Must Read ;- రైతుల ఆందోళనకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మతప్రబోధకుడు
Who will score 1st century in year 2021?
1) Virat Kohli
2) Rohit SharmaMy answer: Petrol⛽️ @imVkohli @ImRo45 @RahulGandhi @priyankagandhi @MahilaCongress @rohanrgupta @kcvenugopalmp @srivatsayb @sushmitadevinc @kumari_selja @SaketGokhale #petrol #rohitsharma #ViratKohli
— Danasari Seethakka (@seethakkaMLA) December 21, 2020
Does they teach this in what’s app university ?
PETROL Rate ₹
🇵🇰 Pak: 46
🇱🇰 SL: 63
🇧🇩 Bangladesh: 77
🇮🇳 India: 90GDP Growth 2020-21
🇧🇩 Bangladesh: 5.2%
🇵🇰 Pak: -0.4%
🇱🇰 SL: -5.5%
🇮🇳 India: -8%@RahulGandhi @priyankagandhi @MahilaCongress @kcvenugopalmp #TooMuchDemocracy— Danasari Seethakka (@seethakkaMLA) December 20, 2020
🔸70,000 Cr Farm loans waived of under Congress Sarkar
🔸6.6 lakh Cr Corporate Bad Loans waived off under Modi ji Sarkar.
🔸Come out of foolishness & understand which is nationalist Sarkar and which is crony-capitalist Sarkar #Congress #CongressForProgress @RahulGandhi #india pic.twitter.com/b06PeOXCFl— Danasari Seethakka (@seethakkaMLA) December 17, 2020
Godi Media and BJP-RSS tried everything to defame the Victim's family.
It was @INCIndia and My Leaders #RahulGandhi & #PriyankaGandhi who stood rock solid with the victims even after being mishandled by Yogi's Police.@RahulGandhi @priyankagandhi #HathrasTruthPrevails pic.twitter.com/lPh2l37M78
— Danasari Seethakka (@seethakkaMLA) December 19, 2020
🔸Before you make fun of children who believe in Santa Claus think about the people who believe in modi ji promises #FarmersProtests
🔸I stand with farmers do you ? @RahulGandhi @MahilaCongress @kcvenugopalmp @manickamtagore #AndhBhakt @rssurjewala @SaketGokhale @rohanrgupta pic.twitter.com/sQlqneOZZn— Danasari Seethakka (@seethakkaMLA) December 18, 2020
This is new Modi ji-Fied India
🔸Dec 2016: we were on streets outside Bank/ATM lines
🔸Dec 2019: Students,CAA protesters were on roads
🔸May,June 2020: Migrant labours were on roads
🔸Dec 2020~Farmers on roads in Delhi #FarmersProtestDelhi @RahulGandhi @MahilaCongress pic.twitter.com/YCkpqYxaxZ
— Danasari Seethakka (@seethakkaMLA) December 13, 2020
ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై బీజేపీపై సీతక్క చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.2019లో ట్విట్టర్లో చేరిన సీతక్క..ఇటీవల స్పీడ్ పెంచారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు సీతక్క. 2019కి ముందు సీతక్క సోషల్ మీడియాలో తక్కువగా కనిపించేవారు. వారి అభిమానులు, ఫాలోవర్లు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప..సీతక్క సొంత పేజీల్లో పెద్దగా పోస్టులు కనిపించేవి కావు. కాని కొవిడ్ సమయంలో ఫేస్ బుక్లో, తాజాగా ట్విట్టర్లో సీతక్క చేస్తున్న పోస్టులపై చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో ఆ పార్టీలకు ధీటుగా స్పందించాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనే చర్చ పార్టీలో నడుస్తున్న నేపథ్యం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
Also Read ;- ప్రశాంత్ కిషోర్ VS బీజేపీ.. ఇక డైరెక్ట్ వార్











