కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఎందరో ప్రముఖులు దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సామాన్యులు , ధనవంతులు అన్న తేడా లేకుండా.. దీని అందరి మీద తన ప్రతాపం చూపిస్తున్న ఈ సమయంలో .. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు తమకు చేతనైన రీతిలో సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ భాషల్లోని కథానాయకులు .. కరోనా బాధితుల పాలిట దేవుళ్ళలా మారారు.

టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలీవుడ్ నుంచి సోనూ సూద్ కరోనా బాధితులకు అండగా నిలిస్తే.. ఇప్పుడు కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ .. వినూత్న రీతిలో కరోనా బాధితుల సహాయార్ధం రంగంలోకి దిగడం అందరినీ ఆకట్టుకుంటోంది. డ్రోన్స్ సహాయంతో .. తమిళనాడులోని వివిధ ఏరియాల్ని శానిటైజ్ చేశారు. దక్ష అనే పేరుతో ఒక టీమ్ గా ఏర్పడి.. సామాన్యులకు అవసరమయ్యే ఉపయోగకరమైన డ్రోన్స్ ను రూపొందించారు. ఆ డ్రోన్స్ తో వీధుల్ని, పబ్లిక్ ప్లేసుల్ని శానిటైజ్ చేయడంతో పాటు.. బాధితులకు దుస్తుల్ని కూడా అందించారు. డ్రోన్స్ తో చేస్తున్న అతడి సహాయం అందరినీ ఆకట్టుకుంటోంది.










