ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు కేవలం రెండు రోజులే మిగిలున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెమ్ నాయుడు సారధ్యంలో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ప్రతిపక్షం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి దాదాపు 20 అంశాలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
సిద్ధం చేసిన అంశాలివే
అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభలో పట్టుపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత, టిడ్కో ఇళ్ల పంపిణీ నిలిపివేత, ఇళ్ల పట్టాలలో పంపిణిలో అవినీతి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం, దానికి ప్రభుత్వ చర్యల వైఫల్యం గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ సమావేశంలో తీర్మానం చేసింది. వరదల కారణంగా రైతుల పంట నష్టం పై అజెండా సిద్ధం చేసి వారిని ప్రభుత్వం ఏమాత్రం ఆదుకుందో నిలదీయాలని కూడా నిర్ణియించింది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, నూతన ఇసుక పాలసీ వల్ల కలిగే నష్టాల గురించి చర్చకు పట్టుపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
రైతులను ఆదుకోండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెమ్ నాయుడు ఏపి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. నివార్ తుఫాను కారణంగా రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారిని పేర్కోన్నారు. ఆగస్ట్, అక్టోబర్ లో కురిసిన అకాల వర్షాల కారణంగా దాదాపు 9 వేల కోట్లకు పైగా పంట నష్టం కలిగిందని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని తెలియజేశారు. నివార్ వల్ల నీటి పాలైన పంటను ప్రభుత్వమే మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, నష్టపోయిన పంట సొమ్ము రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ కి పంపిన లేఖలో అచ్చెమ్ నాయుడు డిమాండ్ చేశారు.
Must Read ;- ఆదుకుంటారా.. అమ్మేస్తారా! తేలని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం