బాలీవుడ్ హీరోయిన్ దిషా పటాని విషయంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు హీరో టైగర్ ష్రాఫ్. వీరిద్దరూ డేటింగ్ గురించి బహిరంగంగా అంగీకరించనప్పటికీ, ఆ ఇద్దరూ కలిసి తరచూ బాలీవుడ్ లో జరిగే పార్టీలకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ జంట మాల్దీవులు వెళ్లారు. అక్కడి నుండి ఈ మధ్యనే తిరిగి వచ్చిన టైగర్ ష్రాఫ్ ఆదివారం రాత్రి ముంబయి నగరంలో చక్కర్లు కొట్టాడు.

ఆయనను తమ కెమెరాలలో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు ఎగపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో టైగర్ ష్రాఫ్ నలుపు రంగు జాకెట్, దానికి మ్యాచింగ్ నలుపు రంగు లూస్ ప్యాంటు ధరించి సహజంగా కనపడ్డాడు. ప్రస్తుత కరోనా నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని టైగెర్ మొహానికి తెలుపు రంగు మాస్క్ వేసుకున్నాడు. ఫోటోలకు అందంగా ఫోజులు ఇచ్చి అక్కడ నుండి బయలుదేరాడు.
టైగర్ ష్రాఫ్, దిషా తాజా ఫోటోలు పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. వారిద్దరి మధ్యన బలమైన సంబంధం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. టైగర్ ష్రాఫ్, దిషా బంధాన్ని వారు బయటకు చెప్పకపోయినా వారిద్దరి ప్రవర్తన ద్వారా అసలు విషయం తెలుస్తోందని అంటున్నారు నెటిజన్లు.
టైగర్ ష్రాఫ్ చివరి సారిగా 2020లో రిలీజ్ అయిన ‘బాఘీ 3’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో శ్రద్ధా కపూర్, రితీష్ దేశ్ముఖ్ కూడా నటించారు. ప్రస్తుతం తారా సుతారియా సరసన ‘హెరోపంటి 2’లో నటిస్తున్నాడు టైగర్ ష్రాఫ్. అలాగే ‘బాఘీ 4’ సినిమాలో కూడా కనపడనున్నాడు. ఈ చిత్రానికి దర్శకునిగా అహ్మద్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తం మీద వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టైగర్ ష్రాఫ్.
Must Read ;- ఖరీదైన ఫ్లాట్స్ కొన్న బాలీవుడ్ స్టార్ డాటర్.. !










