Venkatesh Next Movie With Jathiratnalu Movie Director Anudeep :
విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రంనారప్ప. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఇప్పుడు దృశ్యం 2 సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా..? థియేటర్లో రిలీజ్ చేయాలా..? అని ఆలోచనలో పడ్డారు మేకర్స్. త్వరలోనే దృశ్యం 2 విడుదల పై క్లారిటీ రానుంది అంటున్నారు. ప్రస్తుతం వెంకీ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 శరవేంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇదిలా ఉంటే.. జాతిరత్నాలు అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన డైరెక్టర్ అనుదీప్ తో వెంకీ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జాతిరత్నాలు తర్వాత అనుదీప్ జాతిరత్నాలు సీక్వెల్ చేయాలి అనుకున్నారు. ఈ చిత్రాన్ని మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ప్రస్తుతనికి జాతిరత్నాలు సీక్వెల్ ప్లాన్ వాయిదా పడిందని తెలిసింది. ఈలోపు అనుదీప్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అది వెంకీతోనే అని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే… వెంకీ, అనుదీప్ కాంబినేషన్లో మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారంటున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ‘భీమ్లానాయక్’కు ధీటుగా నిలబడిన డానియల్ శేఖర్