వైసీపీ ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ, రోడ్లు బాగుచేయడంలో లేదంటూ గుడివాడలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నివర్ తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఇవాళ చేపట్టిన యాత్రకు భారీ స్పందన లభించింది. రాష్ట్రంలో రోడ్లన్నీ అస్తవస్త్యంగా తయారయ్యాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అనుకూల మీడియాలో అధికార పార్టీ నేతలు భూతులతో రెచ్చిపోతున్నారని, అలాంటి వారిని సమర్థంగా ఎదుర్కొంటామని గుడివాడలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రోడ్లు బాగు చేయాలని ప్రజాప్రతినిధులను నిలదీయాలని పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు.
ఎవరికీ భయపడం
జనసైనికులు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, ప్రాణం పోయే వరకు జనసైనికులకు అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. దారి పొడవునా జనసేనానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుడివాడలో అతిభారీ దండతో పవన్ కళ్యాణ్ను సన్మానించారు. ప్రజల స్పందన అనూహ్యంగా రావడంతో పవన్ యాత్ర నిధానంగా సాగుతోంది. పెనమలూరు, కంకిపాడు,ఉయ్యూరు, గుడివాడ, ముదినేపల్లి, పెడన, మచిలీపట్నం వరకు ఇవాళ పవన్ యాత్ర సాగనుంది.
Must Read ;- ఫ్యాన్స్ కోసం పవన్ బాగానే ప్లాన్ చేశారుగా..!