బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. యువ హీరోలతో పోటీపడి వరుస సినిమాలు చేస్తున్నారు అమీర్. ఆయన ప్రస్తుతం ‘లాల్సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తున్నారు. అమీర్ ఖాన్ కు జంటగా కరీనా కపూర్ నటిస్తుంది. ఈ చిత్రం హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఢిల్లీలో షూటింగ్ జరుగుతుండగా అమీర్ గాయపడ్డట్లు సమాచారం. పక్కటెముకకు గాయమైనట్లు తెలుస్తోంది.
కొంచెం సమయం రెస్ట్ తీసుకోని పక్కటెముకకు నొప్పి రాకుండ పెయిన్ కిల్లర్స్ తీసుకోని మరలా అమీర్ షూటింగ్ పూర్తి చేసాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకొని రిలీజ్ అవ్వాలి. కాని కరోనా వల్ల ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఈమధ్యనే షూటింగ్ మొదలైంది. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. అమీర్ గాయపడిన విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. అమీర్ ఖాన్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, చాలా చురుకుగా షూటింగ్ లో పాల్గొంటున్నారని వారు తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి బాలీవుడ్కి పరిచయం కానున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమీర్ ఖాన్ సినిమా సంక్రాంతికి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. చాల గ్యాప్ తర్వాత అమీర్ ఖాన్ సినిమా ‘లాల్సింగ్ చద్దా’ వస్తుండడంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లాల్సింగ్ చద్దా’ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసి ఎటువంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి మరి.










