బిగ్ బాస్ 4 ఫైనల్ ఈ నెల 20న గ్రాండ్ గా జరగనుంది. అయితే.. ఈ గ్రాండ్ ఫైనల్ కి గెస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ రియాల్టీ షో ఫైనల్ కి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ ముగ్గురిలో ఒకరు గెస్ట్ గా రానున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఓ వైపు విన్నర్ ఎవరు..? మరో వైపు ఫైనల్ కి గెస్ట్ ఎవరు.? అనేది ఆసక్తిగా మారడంతో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ మరింత ఉత్కంఠ కలిగిస్తుంది. అయితే.. చిరంజీవి సీజన్ 3కి గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఈసారి రాకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జెమిని టీవీకి రియాల్టీ షో చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరో వైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అందుచేత ఎన్టీఆర్ కూడా ఈ ఫైనల్ కి రాకపోవచ్చు అనుకున్నారు. ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తాజాగా సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందే ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం మహేష్ ప్రీగానే ఉన్నారు కాబట్టి మహేష్ బాబు ఫైనల్ కి గెస్ట్ వస్తారని అనుకుంటున్నారు.
అయితే.. బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ గా వచ్చేది ఎవరో తెలిసింది. ఇంతకీ ఎవరంటారా.? మెగాస్టార్ చిరంజీవి. అవును.. స్టార్ మాటీవీ యాజమాన్యం చిరంజీవిని కాంటాక్ట్ చేయడం.. చిరు ఓకే చెప్పడం జరిగిందని తెలిసింది. చిరంజీవి, నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఫ్రెండ్ షిప్ వలనే చిరు వెంటనే ఓకే చెప్పారని తెలిసింది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ ఎపిసోడ్ రికార్డ్ స్ధాయి టీఆర్పీ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి చిరు ఫైనల్ లో సందడి చేయడానికి వస్తుండడంతో ఫైనల్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ఈసారి ఫైనల్ ఎపిసోడ్ టీఆర్పీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- రియాల్టీ షో చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.