మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కోసం చిరంజీవి పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరు ఓకే చేసిన సినిమాల్లో లూసీఫర్ రీమేక్ ఒకటి. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలను ముందుగా సాహో సుజిత్ కి అప్పగించడం… ఆయన తప్పుకోవడం.. ఆతర్వాత వినాయక్ రావడం వెళ్లడం తెలిసిందే. ఇప్పుడు ఈ రీమేక్ ని డైరెక్ట్ చేసే బాధ్యతను తమిళ దర్శకుడు మెహన్ రాజాకు అప్పగించారు. ప్రస్తుతం మెహన్ రాజా చిరంజీవి చెప్పిన కొంత మంది రైటర్స్ టీమ్ అలాగే తన టీమ్ తో కలిసి స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ మూవీ టైటిల్ ఖరారు చేసారంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. బైరెడ్డి. అంతే కాకుండా.. ఈ మూవీకి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు అంటున్నారు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి నిజంగానే బైరెడ్డి టైటిల్ కన్ ఫర్మ్ చేసారా..? లేక ఇది గాసిప్పా..? అని మెగా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అయితే.. చిరంజీవి లూసీఫర్ రీమేక్ కి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని లీక్ చేయద్దు అని చెప్పారట. ఇప్పుడు చిరంజీవి మనసంతా ఆచార్య పైనే ఉందట.
హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో ఆచార్య షూటింగ్ జరుగుతుంది. ఇంకా చిరంజీవి, చరణ్ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సివుంది. వీరిద్దరి పై చిత్రీకరించే సీన్స్ ఈ మూవీకే హైలెట్ గా నిలుస్తాయి అంటున్నారు చిత్రయూనిట్. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలనేది చిరంజీవి ప్లాన్. ఆ తర్వాతే వేదాళం రీమేక్, లూసీఫర్ రీమేక్ లకు సంబంధించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నారట. మరి.. లూసీఫర్ రీమేక్ కి ప్రచారంలో ఉన్న బైరెడ్డి టైటిల్ నే ఖరారు చేస్తారా..? లేక వేరే టైటిల్ పెడతారా..? అనేది తెలియాల్సి ఉంది.
Must Read ;- చరణ్ సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరు?











