వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ప్రస్తుతం ఏ నోటా విన్నా ఇదేమాట వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ కి అనుమతులు వస్తాయా అని ఎదురుచూశారు. అది కాస్త తెలిసిపోవడంతో.. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు జనాలు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 10 రోజుల్లో వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నా కేంద్ర ఆరోగ్య సెక్రటరీ తెలియజేయడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నాయి.
డ్రై రన్ ఆధారంగా..
286 చోట్ల నిర్వహించిన డ్రై రన్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డ్రై రన్ ఆధారంగా.. వ్యాక్సిన్ ఎలా నిర్వహించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి కూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే వాటి పైన ఇక అంచనా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిని ఆధారం చేసుకుని వ్యాక్సిన్ ఎలా అందించాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు అందిన మరుక్షణం డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, పోలీస్, శానిటైజర్ వర్కర్స్.. ఇలా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ కోసం వీళ్లు ప్రత్యేకంగా రిజిష్టర్ చేయించుకోవాల్సిన పనిలేదని.. వీరి డేటాను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపింది.
Must Read ;- ఆక్స్ ఫర్డ్-అస్ట్రాజెన్కా వ్యాక్సిన్ మొదట వేయించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

రాష్ట్రాల ఏర్పాట్లు
వ్యాక్సిన్ విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు సైతం.. వ్యాక్సిన్ వివరాలు అందించే పనిలో పడింది. మొదటి దశలో అందించాల్సిన డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వివరాలను ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారాన్ని కేంద్రానికి అందించలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం 2.8 లక్షల మందిని మాత్రమే నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ వివరాలనే ఇంకా సిద్ధం చేయకపోతే.. ఇక మామూలు ప్రజల వివరాలు ఎప్పటి సేకరిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నారు.
ఇక మిగిలిన రాష్ట్రాల వివరాలు చూస్తే, గుజరాజ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్.. మిగిలిన రాష్ట్రాలు పూర్తి వివరాలతో సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే డ్రై రన్ అన్ని రాష్ట్రాలలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో.. వ్యాక్సిన్ అందించడం కాస్త సులభతరం కానుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
Also Read ;- కొవ్యాక్సిన్, కొవిషీల్డ్లకు డిసిజిఐ ‘గ్రీన్ సిగ్నల్’











