మాస్ మహారాజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఎట్టకేలకు ఈ సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఆటలు ప్రారంభించారు. రవితేజ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ సినిమా ఈ ఉదయం విడుదల కావలసి ఉన్నా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు బొమ్మ పడటంతో అటు చిత్ర వర్గాలు, ఇటు రవితేజ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సినిమా షో పడగానే దర్శకుడు గోపీచంద్ బొమ్మ పడిందంటూ ట్వీట్ చేశారు.
ఈ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్మాత ఓ ఒప్పందానికి రావడంతో సినిమా విడుదలకు కావలసిన ఆటంకాలు తొలగిపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఈరోజే విడుదల చేయడానికి కూడా కారణముంది. జనవరి 10 విడుదలైన సినిమాలేవీ ఆడలేదు. అందువల్ల ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో సినిమా విడుదల కావలసిందేనని రవితేజ అభిమానులు పట్టుబట్టినట్టు తెలిసింది. అందుకే రేపు అనేది విరమించుకుని ఈరోజే విడుదలకు నిర్మాత సిద్దపడినట్టు సమాచారం.
Must Read ;- ‘అయోగ్య’ లావాదేవీల వల్లే ‘క్రాక్’ కు షాక్?
Thanking all my fans and well wishers who've been waiting to watch KRACK and have waited a little too long to watch it in the theatres, all out of love. Your love is my energy. Thank you once again 🙏
— Ravi Teja (@RaviTeja_offl) January 9, 2021
All problems solved for #Krack release. 🔥🔥👍👍
Let's get Krackified from today's first shows. 💥
Watch it now in your nearest theaters!! pic.twitter.com/50y8HzFLqR— Gopichandh Malineni (@megopichand) January 9, 2021