మెహ్రీన్.. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటిస్తుంది. ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు షూటింగ్ లు స్టార్ట్ అవ్వడంతో.. ఎఫ్ 3 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న సినిమలో కూడా నటిస్తుంది.
యు.వి. క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమాతో పాటు మెహ్రీన్ మరో సినిమాకి కూడా ఓకే చెప్పిందని.. వార్తలు వచ్చాయి. ఇంతకీ ఏ సినిమా అంటారా.. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమా. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మెహ్రీన్ కన్ ఫర్మ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై మెహ్రీన్ స్పందించింది. ఇంతకీ ఏమన్నదంటే.. ప్రస్తుతం నేను మారుతి – సంతోష్ శోభన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీతో బిజీగా ఉన్నాను.
మీరందరూ ఆ మూవీని ఎంత త్వరగా చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఇక, నా ఇతర సినిమాల గురించి వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదు. నేను ఇక్కడ చెప్పేంతవరకు దేన్నీ నమ్మొద్దు అని ఈ అమ్మడు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనిని బట్టి బాలయ్య సినిమాలో మెహ్రీన్ నటించడం లేదని తెలుస్తుంది. మరి.. బాలయ్య మూవీలో హీరోయిన్ గా ఎవర్ని ఫైనల్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- మెహ్రీన్ బ్రేకప్ కి అసలు కారణం ఇదే.