2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ టిడ్కో, కేంద్ర ప్రభుత్వం, లబ్దిదారుల భాగస్వామ్యంతో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ కి శ్రీకారం చుట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కోట్లు వెచ్చించి నిర్మించిన టిడ్కో నిర్మాణాలు దెబ్బ తింటున్నాయి. దీంతో నాలుగు రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రతి పక్షాలు, లబ్ది దారులు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల ఫలితమో… లేక ఫిబ్రవరిలో జరగనున్న స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫలితమో గానీ నెల్లూరు జిల్లా అధికారులు లబ్ది దారులకు పూర్తి అయిన ఇల్లు అందించడానికి బుధవారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు
Must Read:-నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లకు రాజకీయ గ్రహణం…!
2 ఏళ్ల కలలు నిజమవుతున్న వేల…!
నెల్లూరు నగరపాలక సంస్థ, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల పరిధిలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో 58,235 ఇళ్లను నిర్మించాలని తీర్మానించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరు పల్లి, కొండలపూడి, వెంకటేశ్వరపురం-2, ఇరుకాళమ్మ ఆలయం గృహ సముదాయాలను ఏర్పాటు చేశారు. గూడూరు పరిధిలో గాంధీనగర్, ఆత్మకూరు పరిధిలో నెల్లూరు పాళెం, కావలి పురపాలికలో మద్దూరుపాడు, జమ్మలపాళెం, నాయుడుపేట ప్రాంతంలో బీరదవాడ, సూళ్లూరుపేటలో మన్నారుపోలూరు, వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లె ప్రాంతాల్లో సముదాయాలు నిర్మించారు. సుమారు 17,000 వేల ఇల్లు పూర్తి అవ్వగా, కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. పనుల బాధ్యతను కొత్త గుత్తేదారులకు అప్పగించింది. దీంతో పాటు.., బుధవారం నుంచి నవంబర్ 20 వ వరకు లబ్దిదారుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుని ఇప్పటికే పూర్తి అయిన ఇల్లు అందిస్తామని అధికారులు అంటున్నారు.
Also Read:-BREAKING : మంత్రి అనిల్ కాన్వాయ్కు ప్రమాదం
5,712 ప్లాట్లకు రెడ్ సిగ్నల్..!
ఏపీ ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం పునాదుల వరకు ఎలాంటి పనులు చేయకుండా ఉన్న 5,712 గృహాల ప్లాట్లను టిడ్కో ఇంజినీర్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 300 చ.అ. ఇళ్లు 2400, 365 చ.అ. ఇళ్లు 1104, 430 చ.అ.ఇళ్లు 2208 వరకు ఉన్నాయి. రద్దు చేసిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి పక్షాల ఆందోళనలో లేక నిమ్మగడ్డ ప్రకటన ఫలితమో లేక ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతో గానీ ఎట్టకేలకు పూర్తి అయిన ప్లాట్లను లబ్దిదారులకు ఇవ్వడానికి అధికారులు ముందుకు కదిలారు. దీంతో ఇల్లు లేక అవస్థలు పడుతున్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా పనులు లేక, ఇంటి అద్దెలు కట్టలేక, బ్యాంకుల నుంచి వస్తున్న నోటీసులతో భయపడుతూ బాటుకుతున్నామని, ఇప్పటికైనా ఇల్లు ఇస్తే తమకు మేలు చేసినవాళ్ళు అవుతారని ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.
చూడాలి.. ఈ అధికారుల అడుగులు లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇచ్చేవరకు సాగుతాయో.. లేక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనది అని ఆగిపోతాయో అంటే వేచిచూడాల్సిందే….?
Also Read:-కొవిడ్ వారియర్స్ ని రోడ్డుపై పడేస్తారా?