మహేష్ బాబు చర్మ సౌందర్యంలోని మర్మమేమి చెప్మా అంటూ ఆశ్చర్యపోతోంది సాయిపల్లవి. సినిమా తారలకు అందాన్నిచ్చే సోప్ ఏమన్న వాడుతున్నాడా అని అనలేదు గానీ ఇంత చర్మ సౌందర్యం ఎలా సాధ్యం అని మాత్రం విస్తుపోతోంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు అందగాడే కాదనలేం.. అమ్మాయిల కలల రాజకుమారుడే అది కూడా కాదనలేంగానీ.. సిసలైన చర్మ సౌందర్యానికి మారుపేరైన కేరళ నుంచి వచ్చిన కుట్టి ఇలా మాట్లాడటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక హైబ్రిడ్ పీస్ ఇంకో హైబ్రిడ్ పీస్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చూద్దాం.
సాయి పల్లవిలో దృష్టిలో మహేష్ బాబు మచ్చలేని మొనగాడు అనుకోవచ్చేమో. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాపిడి ఫైర్ ప్రశ్నలకు ఆమె టక టకా సమాధానాలు చెప్పేసింది. అందులో మన మహేష్ బాబు ప్రస్తావన కూడా ఉంది అంతే. మహేష్ బాబు చర్మంపై ఇసుమంత మచ్చ కూడా లేకుండా బంగారంలా మెరిసిపోవడం చూసి తాను ఆశ్చర్యోపోయానని సాయిపల్లవి అంటోంది. ‘ఆయన చాలా అందంగా కనిపిస్తాడు. అలాంటి చర్మం నేనింతవరకూ చూడలేదు.
ఆయన సినిమాలు చూసినప్పుడు ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యం అనిపించింది’ అంటూ కామెంట్ చేసింది. 45 ఏళ్ల వయసులోని మహేష్ బాబు యువ తారాజువ్వ సాయి పల్లవిని ఇంతలా ఆకట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ. సాయి పల్లవి మంచి డ్యాన్సర్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పటిదాకా యువ హీరోలతోనే జత కడుతోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జత కట్టాలనుకోవడంలోనూ తప్పేమీ లేదు.
ప్రస్తుతం ఈమె నాగ చైతన్యతో లవ్ స్టోరీలో నటిస్తోంది. మహేష్ బాబు మాత్రం ‘సర్కారు వారి పాట’కు సిద్ధమైపోయాడు. అందులో సాయి పల్లవికి కూడా కాస్త చోటు దొరికితే ఆమె ఎగిరి గంతేస్తుంది. పరశురాం దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రస్తుతానికి కీర్తి సురేష్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఏదేమైనా సాయి పల్లవి మాత్రం తన మనసులో మాటను బయటపెట్టింది. మహేష్ బాబు చర్మాన్ని ఇంత దగ్గరగా ఆమె ఎప్పుడు చూసిందో మాత్రం మనకు అర్థం కావడం లేదు. ఈ భామ అంతగా ఫిదా అవడానికి కారణం ఏమిటో?
Must Read ;- ఒక్కడు సీక్వెల్ ప్లాన్ మహేష్ ఓకే చెబుతారా.?