అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. అయితే.. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీని ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని ఎనౌన్స్ చేశారు కానీ.. కథ ఏంటి..? అందులో చైతన్య పాత్ర ఏంటి..? అనేది చెప్పలేదు. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో చైతు స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నారని తెలిసింది. అది కూడా హాకీ ప్లేయర్ రోల్ అని టాక్ వినిపిస్తోంది. మజిలీ సినిమాలో చైతన్య క్రికెట్ ప్లేయర్ గా కనిపించాడు. మళ్లీ.. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది.
మరో విషయం ఏంటంటే… ఇందులో చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని.. అందుకనే అనుకుంట ఇందులో ముగ్గురు కథానాయికలని తెలిసింది. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ ను ఎంపిక చేసారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది తెలియాల్సివుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మనం తర్వాత చైతు – విక్రమ్ కుమార్ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీతో చైతన్యకు మరో మంచి చిత్రాన్ని అందిస్తారని టాక్ వుంది. మరి.. ఆ అంచనాలను అందుకుంటారని ఆశిద్దాం.
Must Read ;- చై సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?