తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని కోలీవుడ్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు విలన్ గా ‘మక్కల్ సెల్వన్’ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు. విజయవంతమైన ‘క్రిష్’ సిరీస్ లో భాగంగా తెరకెక్కనున్న క్రిష్-4లో విజయ్ సేతుపతి నటించడం ఖాయమని తెలుస్తోంది. క్రిష్ సిరీస్ లో భాగంగా వచ్చిన మొదటి మూడు భాగాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ రోషన్ ‘ఏలియన్’ నేపథ్యంలో ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలోనే ప్రారంభం కావలసి ఉంది. కాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసిన రాకేష్ రోషన్ నటి నటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కథ పరంగానే మాత్రమే గాకుండా బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని తెలుస్తోంది. విజయ్ సేతుపతిని ప్రాజెక్టులో తీసుకోవడం వల్ల సౌత్ ఇండియాలో ఈ సినిమాకు బిజినెస్ జరగడమే కాకుండా కలెక్షన్ల పరంగా బాగుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికార ప్రకటన రానుంది.









