బీజేపీ నేతల వ్యూహం ప్రకారం ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా.. ఆగలేక పోతున్నారు. ఫ్రస్టేషన్లో మనసులోని మాటలు తన్నుకొస్తున్నాయి. నియంతను చూస్తుంటే మనకు సంబంధం లేకపోయినా.. బీపీ పెరుగుతుంటుంది. రాజకీయాలతో సంబంధమున్నవాళ్లకు… రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండే వాళ్లకు.. అందులోనూ అధికారానికి దూరంగా ఉన్నవారికైతే కోపంతో నరాలు ఉబ్బుతూ ఉంటాయి. అప్పుడు కడుపులో ఉన్నది కక్కేస్తారు. వారి దగ్గర ఉన్న సమాచారం అంతా నాలుక ద్వారా గాల్లో టైప్ చేసేస్తుంటారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే బయటపడ్డారు.
ఆంధ్రా కిమ్..
జగన్ నియంత అని.. ఉత్తర కొరియా కిమ్ లాగే ప్రవర్తిస్తున్నారని.. ఆయనను ఆంధ్రా కిమ్ అని పిలుచుకోవచ్చని విష్ణుకుమార్ రాజు కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదు. స్థానిక ఎన్నికలు పెట్టాలని అందరూ చెబుతున్నా.. నియంతలా అన్నీ ఆపేస్తే మనమేం చేస్తాం అంటూ… ఈయన రెండున్నరేళ్లలో మంత్రి వర్గం మారుస్తానన్నాడు.. కాని రెండున్నరేళ్లలో ఏకంగా సీఎం మారిపోతాడన్నారు. ఆయన ప్లేసులో ఆయన భార్య వైఎస్ భారతిని సీఎం చేసి.. చరిత్ర సృష్టించాలని.. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంలు మాత్రం మహిళలకు ఇచ్చారని.. భార్యకు డైరెక్టుగా సీఎం పోస్టు ఇస్తే .. ప్రజలు కూడా సంతోషిస్తారన్నారు. ఎందుకంటే జగన్ కంటే భారతీయే బెటరన్నారు.
జైలు కెళ్లినా..
సీఎం మారిపోతారని.. జగన్ జైలు కెళతారని.. ఆయన భారతిని సీఎంగా చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాది లోపు పూర్తి చేయాలన్న ప్రతిపాదనపై కసరత్తు మొదలైన దగ్గర నుంచి ఇది మరింత పెరిగింది. అందుకే సుప్రీంకోర్టు జస్టిస్కే కులం, రాజకీయం అంటగడుతూ లేఖ రాయడం.. అందులో హైకోర్టు జడ్జిలు సైతం కులం, రాజకీయం ఆధారంగా తీర్పులిస్తున్నారంటూ ఆరోపించడం.. దానిని వ్యూహాత్మకంగా లీకు చేయడం వంటివి చేశారని.. ఇవన్నీ తాను జైలు కెళ్లినా.. అన్యాయంగా పంపారని ప్రచారం చేసుకోవడానికి, ప్రజల్లో సానుభూతి పెంచుకుని.. జైలు కెళ్లినా రాజకీయంగా బలపడటానికేనని చెప్పుకున్నారు.
Must Read ;- కలవరమాయే జగన్ మదిలో..
కేంద్ర స్థాయిలో ఆయనకు ఏమైనా సమాచారం ఉందా..
ఇప్పుడు మళ్లీ బీజేపీ నేత ఇలా కామెంట్ చేయడంతో.. బీజేపీ నేత కాబట్టి.. కేంద్ర స్థాయిలో ఆయనకు ఏమైనా సమాచారం ఉందా.. నిజంగానే జగన్ జైలు కెళ్లబోతున్నారా అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. వాస్తవంగా జగన్పై ఉన్న కేసులు సుప్రీంకోర్టు ప్రతిపాదన ప్రకారం వేగంగా విచారణ పూర్తి చేస్తే.. జైలుకెళ్లడం ఖాయమేనని చాలామంది అడ్వకేట్లు చెబుతున్నారు. ఈలోపు రాజకీయంగా దెబ్బ తినకూడదనే వ్యూహంతోనే.. నిమ్మగడ్డ ఉండగా స్థానిక ఎన్నికలు పెట్టకూడదని పట్టుబట్టడం.. ఇళ్ల స్ధలాలను వివాదాలున్నా సరే పంచి పెట్టాలని.. డబ్బులు లేకపోయినా సరే.. అప్పులు చేసైనా సరే నవరత్నాల వంటి ఓటు బ్యాంకు పథకాలకు నిధులు అందించి.. దాని కోసం అధికారులను వేధించడం కూడా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఏమైనా విష్ణుకుమార్ రాజు కామెంట్లు.. మళ్లీ జగన్ జైలుకెళ్లే అంశంపై చర్చను రేపాయి. ఆయన డైరెక్టుగా సీఎం మారిపోతాడని చెప్పడం.. వైఎస్ భారతి సీఎం అవుతుందని చెప్పడం.. పైగా బయట అందరూ చెప్పుకునేవే నేను చెబుతున్నా.. నాకేం భయం లేదు కాబట్టి ఓపెన్గా అంటున్నా అని కూడా అన్నారు. దీంతో జగన్ వ్యతిరేకులంతా ఆయన జైలుకెళ్లడం ఖాయమే అని చెప్పుకుంటున్నారు.
Also Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం