మనమెంత పట్టుబట్టినా.. ఎంత పగబట్టినా.. చట్టాలు, వ్యవస్ధలోని నిబంధనలు అనుకూలంగా ఉండాలి కదా. వాటికి పాపం మనలాగా పగలు, ప్రతీకారాలు తెలియవు కదా.. వాటిని వాడే మనుషులకు తప్ప. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని .. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయ్యాకే పెట్టాలని పట్టుబట్టినా.. నిబంధనలు అనుకూలించేలా లేవు. హైకోర్టు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తుంటే.. స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పేలా ఉంది. దానికి సుప్రీంకోర్టు కూడా దాదాపు అడ్డుపడేలా లేదు. ఎందుకంటే వద్దనే వారి వద్ద సరైన రీజన్ లేదు. అందుకే ఇప్పుడు వైసీపీకి స్థానిక ఎన్నికల భయం పట్టుకుంది.
వారి పప్పులు ఉడకవనే..
బలంగా ఉన్నారు కదా.. వారికి భయమేంటి అని అడిగేవారు కూడా ఉంటారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండగా.. వీరి పప్పులు ఉడకవు. ఎలాబడితే అలా చేసుకోవడానికి అవదు. చొక్కా పట్టుకుని మరీ అపోజిషన్ క్యాండేట్ను నామినేషన్ వేయనీయకుండా లాక్కుపోలేరు. కేసులు పెడతామని పోలీసులతో ఫోన్ చేయించి బెదిరించలేరు. ఏం జరిగినా నిముషాల్లో వాళ్లు నిమ్మగడ్డకు కంప్లయింట్ పెడతారు.. ఆయన సెకండ్లలో స్పందిస్తారు. వీళ్లనుకున్నది జరగదు. అప్పుడు ఫలితాల్లో తేడాలొస్తాయి.. ఇప్పటి వరకు 151 మంది ఎమ్మెల్యేలంటూ పలికే పలుకులకు బ్రేక్ పడొచ్చు. ఈ ఫలితాల ప్రకారం ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ హవా ఇంకా ఉందో లేదో తేలిపోతుంది. అప్పుడు వీకయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి మన జగన్మోహన్ రెడ్డి కనీసం ఊహకి కూడా తట్టుకోలేరు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు పెట్టడానికి వీల్లేదని భీష్మించుకున్నారు. చాలామంది నిమ్మగడ్డ మీద కోపంతోనే జగన్ అలా చేస్తున్నారనే భ్రమల్లో ఉన్నారు. అది పైకి మాత్రమే.. లోపల బాస్కి ఈ లెక్కలన్నీ గిర్రున తిరుగుతున్నాయి.
Must Read ;- ‘తోటపల్లి’కి వైసీపీ బ్రేక్.. రైతన్నల గగ్గోలు

వారి నేతలే శాపనార్ధాలు
పెన్షన్లు నుంచి తోడు నీడ లాంటి పథకాల వరకు పర్వాలేదు గాని.. చాలా పథకాల్లో అవి తమకు అందలేదనే లబ్ధిదారులు చాలా మందే ఉన్నారు. ఇక ఇళ్ల స్ధలాలదైతే చెప్పనక్కర్లేదు. పక్కాగా వైసీపీ నేతల రికమెండేషన్లతోనే లబ్ధిదారుల ఎంపిక చేశారు. పైగా అద్భుతమైన ఏరియాల్లో, అద్భుతమైన లొకేషన్లు ఎంపిక చేసినందుకు ఇప్పటికే వైసీపీ లోకల్ నేతలతోనే శాపనార్ధాలు పెట్టించుకుంటున్నారు. అందులోనూ కక్కుర్తిపడటంతో.. వ్యవహారాలు కోర్టులకెక్కి అసలుకే ఎసరొచ్చింది. ఇవన్నీ చాలక ఇసుక దెబ్బ ఎటూ ఉంది. పైకి నీతిగా చెబుతూ లోపల అవినీతి చేస్తూ.. దానిని కప్పిపుచ్చుకోలేక అధికార పార్టీ నేతలు నానా పాట్లూ పడుతూనే ఉన్నారు.. జనాన్ని కష్టాలు పెడుతూనే ఉన్నారు.
మరో వైపు పోలీసు రాజ్యం
ఇలాంటివన్నీ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించటం ఖాయమనే కామెంట్లు వినపడుతున్నాయి. ఇక వైసీపీ పోలీసు రాజ్యం ఎటూ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబం ఉదంతం ఒక్కటి చాలు.. రాష్ట్రంలో పోలీసులు ఎవరి మాట వింటున్నారు.. చట్టం ఎవరి చుట్టమైందో అర్ధం చేసుకోవడానికి. అమరావతి నిరసనల ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం మీద చూపించే అవకాశముంది. ఇన్ని అంశాలు కళ్లెదురుగా పెట్టుకుని.. ఏ ధైర్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండగా ఎన్నికలకు వెళతారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వెళ్లలేరు.. అందుకే హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగి తిరిగి ప్రజాధనం వృధా చేసైనా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కాని ఆపలేరు.. ఎందుకంటే నిబంధనలకు ఈ లెక్కలతో సంబంధం లేదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆ నిబంధనలు తెలియనవి కావు.
Also Read ;- ఏం పీకుతారు: బాబు :: పీకించుకోడానికి వచ్చారా : జగన్











