ఏపీలోని జగన్ సర్కారు.. గత చంద్రబాబు ప్రభుత్వంపై పోలవరంలో, పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి చివరవకు కాగ్ నివేదిక, కోర్టు తీర్పులతో డంగైపోయింది. ఈ విషయాల్లో అక్రమాలే లేవంటూ తేలిన ఫలితాలతో జగన్ సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది. అప్పటికీ సర్దుకోకుండా.. అమరావతి రాజధాని భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదని, దళితుల భూములు లాక్కున్నారని ఆరోపణలు చేసి కోర్టుకు పోతే కోర్టులు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని, దళిత భూముల బలవంతంగా తీసుకోలేదని స్వయంగా హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పాయి. టీడీపీపై వైసీపీ నేతలు ఎలాంటి అవినీతి ఆరోపణలు చేసినా విచారణల్లో అవి నిలవడం లేదు. తాజాగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లో అండ్రూ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ కు పాల్పడిందని, ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగిందని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసే దిశగా కదులుతోంది. గతానుభవాల దృష్ట్యా.. ఈ వ్యవహారంలోనూ జగన్ సర్కారుకు వ్యతిరేక ఫలితమే రావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
టీడీపీపై ఎందుకీ దాడి..?
సీఎం జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని నాతవరం మండలంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ ను లేటరేట్ ముసుగులో విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ వ్యవహారం గుట్టును విక్రాంత్ రెడ్డి వ్యాపార భాగస్వామి లవకుమార్ రెడ్డి ఓ గిరిజనుడితో మాట్లాడుతూ బయటపెట్టారు. ఈ ఆడియో టేపు బయటకు వచ్చి వైసీపీ నేతలను అడ్డంగా బుక్ చేసి పారేసింది. ఈ వ్యవహారంపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు బృందాలను కూడా ఎన్జీటీ రంగంలోకి దింపింది. ఈ పరిశీలనలో వైసీపీ నేతలు పాల్పడ్డ అక్రమాలు వెలుగు చేశాయి. లేటరైట్ పేరిట బాక్సైట్ ను గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు ఏ మేర అడవులను నాశనం చేశారన్న విషయం కూడా బయటపడిపోయింది. మొత్తంగా వైసీపీ అక్రమాలను విపక్ష టీడీపీ బయటపెట్టినట్టైంది. తమ అక్రమాలను బయటపెట్టిన టీడీపీని కూడా కోర్టు బోనులో నిలిపే దిశగా కదులుతున్న వైసీపీ.. ఇప్పుడు ఆండ్రూ మైనింగ్ టీడీపీ హయాంలో.. ఆ పార్టీ నేతల అండదండలతోనే అక్రమ మైనింగ్ కు పాల్పడిందన్న విషయాన్ని ఎత్తుకున్న వైసీపీ సర్కారు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చే దిశగా కదులుతోంది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఆందోళన చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పిర్యాదు చేయారు. పిర్యాదు సీవీకరించిన ట్రిబ్యునల్ విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతములో విచారణ చేస్తున్నారు.
ఆండ్రూపై ఆరోపణలు
చంద్రబాబు హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో అండ్రూ మైనింగ్ సంస్థ నిర్వహణలో అక్రమ బాక్సైట్ తవ్వకాలు పై ఆరోపణలు వచ్చాయంటూ గనుల శాఖ రంగంలోకి దిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అండ్రూ మినరల్స్ సంస్థ లేటరేట్ కు బదులు అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు జరిపి చైనాకు ఎగుమతి చేసిందని, దీని వలన రూ.230 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గనుల శాఖ వాదిస్తోంది. 2013 లో మైనింగ్ అనుమతులు తీసుకున్న అండ్రూ మినరల్ సంస్థ 2019 వరకు మైనింగ్ సాగించిందని ఆ శాఖ చెబుతోంది. ఈ మైనింగ్పై తమకు పిర్యాదులు అందాయని, ఆ ఫిర్యాదుల ఆధారంగానే ఇప్పుడు విచారణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. 2013 నుండి 2019 వరకు ఈ సంస్థ ఒడిశా లో వేదంత కంపినీకి 2 లక్షల టన్నుల లేటరేట్, చైనాకు 4.65 టన్నుల లేటరేట్ ను తరలించిందని, అయితే ఎగుమతి చేసింది లేటరైటా? లేక బ్యాక్సైటా? అని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరి ఈ విచారణలో గనుల శాఖ జగన్ సర్కారు వాదనను ఎలా నిరూపిస్తోందోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్ కోర్టు మెట్లెక్కాల్సిందేనా?











