ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య.. రీసెంట్రీ తర్వాత చిరంజీవి చేసిన సినిమాలివే. ఇంకా చెప్పాలంటే
వీటిలో ఆచార్య ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ మాటకొస్తే షూటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. సో.. మెగా స్టార్ కెరీర్ లో ఎంత గ్యాప్ వచ్చిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కరోనా వల్ల హీరోల కెరీర్స్ లో గ్యాప్స్ వచ్చాయి. కానీ వాళ్లతో పోలిస్తే చిరంజీవి కెరీర్ ఇంకాస్త స్లోగా నడుస్తోంది.
ఈ గ్యాప్స్ అన్నింటినీ ఒకసారి కవర్ చేయబోతున్నారు చిరంజీవి. ఈసారి థర్డ్ వేవ్ తో సంబంధం లేకుండా చకచకా సినిమాలు పూర్తిచేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఆచార్యను వీలైనంత తొందరగా పూర్తిచేసి, ఆ వెంటనే లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత కూడా గ్యాప్ తీసుకోవడం లేదు. బాబి లేదా మెహర్ రమేష్ లో ఎవరి స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది మెగా ప్లాన్.
ముందుగా ఆచార్య..
ఆచార్య విషయానికొస్తే, ఈ సినిమాకు సంబంధించి 12-15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. వచ్చేనెల మొదటి వారం నుంచి ఆ చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో చరణ్-పూజాహెగ్డేపై ఓ సాంగ్, చిరంజీవి-కాజల్ పై మరో సాంగ్ తీయబోతున్నారు. అదనంగా మరికొన్ని సన్నివేశాలు తీసి, షూటింగ్ పూర్తిచేయబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆచార్య పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయాలని నిర్ణయించారు చిరంజీవి. ఈ మేరకు దర్శకుడు మోహన్ రాజాకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. ఆగస్ట్ చివరి వారానికి సిద్ధంగా ఉండాలని చెప్పేశారు. సినిమాకు సంబంధించి మోహన్ రాజా ఆల్రెడీ స్క్రీన్ ప్లే లాక్ చేశారు. బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు. మరోవైపు లూసిఫర్ రీమేకు సంబంధించి ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైమ్ కు తమన్ 2 బాణీల్ని ఫైనల్ చేసే పనిలో పడ్డాడు.
ఫ్యూచర్ ప్లాన్స్
చిరంజీవి ఖాతాలో చాలా సినిమాలున్నాయి. స్వయంగా మెగాస్టార్ తన సినిమాల లిస్ట్ ను బయటపెట్టారు. వాటన్నింటినీ చకచకా పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు చిరు. లూసిఫర్ అయిన వెంటనే బాబి లేదా మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. సో.. రాబోయే 2-3 ఏళ్లు చిరంజీవి చాలా బిజీగా గడపబోతున్నారు.
Must Read ;- చిరు సరసన బాలీవుడ్ భామలు.? ఇంతకీ ఏ సినిమాలో..?











