ఈమధ్య కాలంలో సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అనేకమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అసలే ఈ మధ్య ఓటీటీల హవా కూడా బాగా నడుస్తోంది. చాలా వరకు వెబ్ సిరీస్ లు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకనే ప్రముఖ నటులు కూడా వాటిలో నటించేందుకు సిద్ధపడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరు వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దపడుతున్నారు. ఆమె ఎవరో కాదు సొనాక్షి సిన్హా. ‘దబాంగ్’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సొనాక్షి ఆతర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది సొనాక్షి సిన్హా. అలాంటి సొనాక్షి ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొనబోతోంది.
రీమా లగ్దీ అనే మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న `ఫాలెన్` వెబ్ సిరీస్లో సొనాక్షి ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో సొనాక్షితో పాటుగా `గల్లీ బాయ్` ఫేమ్ విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహుమ్ షా తదితరులు నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే సొనాక్షి ఈ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పింది. డిసెంబర్ నెల నుంచి రాజస్థాన్లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ వైవిధ్యమైన కథా అంశంతో తెరకెక్కబోతుందని సమాచారం. ఇందులో సొనాక్షి నటన ప్రేక్షకులను ఆకుట్టుకునేలా దర్శకురాలు ఆపాత్రను తీర్చిదిద్దిందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ పై రీమా కాగ్దీ పూర్తి స్పష్టత ఇవ్వనున్నాడని తెలుస్తోంది. సొనాక్షి చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.