అక్కినేని హీరోల కెరీర్ లోనే కాకుండా.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమా మనం. ఇంకా చెప్పాలంటే.. ఇదొక అద్భుతమైన చిత్రం. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కొంత మంది ఫ్యామిలీ హీరోల కలిసి ఇలాంటి సినిమా చేయాలి అనుకున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు చాలా మంది మెగా మనం కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది మెగా హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ కోసం ఎవరైనా ఒక మంచి మనం కథను రెడీ చేయక పోతారా అని ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు మెగా మల్టీస్టారర్ కు స్టోరీ రెడీ అయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ బయటపెట్టారు. అయితే.. ఈ కథను రాసింది క్రిష్ కాదు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కావడం విశేషం. అవును.. ఉప్పెన, కొండపొలం చిత్రాల కథానాయకుడు వైష్ణవ్ తేజ్ మెగా హీరోలు కోసం మనం రేంజ్ లో ఓ కథ రాశాడట. ఈ కథను కొండ పొలం షూటింగ్ సమయంలో చెప్పాడంటూ క్రిష్ తెలియజేశాడు. వైష్ణవ్ తేజ్ కు అసలు హీరో అవ్వాలని ఉండేది కాదట. దర్శకుడిగా సినిమాలు చేయాలని చాలా కథలు రాసుకున్నాడట.
అయితే.. కళ్యాణ్ మామయ్య మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆయన సలహాతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఆతర్వాత హీరో అవ్వమని సలహా ఇచ్చారు అంటూ వైష్ణవ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో అసలు విషయం బయటపెట్టాడు. హీరో అయినా కూడా తనలోని దర్శకుడిని వైష్ణవ్ అలాగే ఉంచాడట. మనం సినిమా అక్కినేని వారికి ఒక మంచి జ్ఞాపకంగా ఎలా అయితే నిలిచిందో అలాంటిదే మెగా ఫ్యామిలీకి ఉండాలనే ఉద్దేశ్యంతో వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ కోసం కథను రాశాడట. మరి.. ఈ కథ ఎప్పుడు తెర పైకి వస్తుందో.? ఎవరు తెరకెక్కిస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Must Read ;- మెగాస్టార్ సరసన మిల్కీబ్యూటీ.. ఇది నిజమా..?