అందం, అభినయం.. ఒకే మోతాదులో అందించే కథానాయికలు చాలా తక్కువ. విద్యాబాలన్ లాంటి బోర్న్ ఆర్టిస్ట్ లకే అది చెల్లింది. అమ్మడి రూటే సెపరేట్. ఒక పక్క సోయగాల ప్రదర్శన చేసి ఈ వయసులో కూడా కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేయగలదు. మరో పక్క అనితర సాథ్యమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించనూ గలదు. ఈ టాలెంట్ తోనే విద్యాబాలన్.. ప్రముఖుల జీవిత కథలకు జీవం పోసే విద్యలో ఆరితేరింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె నటించిన ‘డర్డీ పిక్చర్’ సినిమా. సిల్క్ స్మిత జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అందం, అభినయంతో భారతీయ ప్రేక్షకుల్ని అబ్బుర పరిచింది. ఆ తర్వాత యన్టీఆర్ సిరీస్ లో బసవతారకంగా అద్భుతమైన పెర్ఫార్మాన్స్ తో తెలుగు వారిని అబ్బుర పరిచింది.
ఇక తాజాగా విద్యాబాలన్ నటించిన ‘శకుంతలాదేవి’ మూవీ కూడా భారతీయ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. హ్యూమన్ కంప్యూటర్ గా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన శకుంతలాదేవి పాత్రను, ఆమె భావోద్వేగాల్ని, ఆమె ఇంటెలిజెన్స్ ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో పలికించి .. తనకు తానే సాటి అనిపించుకుంది విద్య. త్వరలో ఆమె మరో ప్రముఖ పెర్సనాలిటీకి జీవం పోసే ప్రయత్నంలో ఉంది. ఆమె మరెవరో కాదు సాక్షాత్తూ ఇందిరాగాంధి. అవునండీ.. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని గా చరిత్ర సృష్ఠించిన ఇందిరాగాంధీ గా, ఆ పాత్ర తాలూకు ఆత్మను పట్టుకొనే కసరత్తులు చేస్తోంది. ఈ సినిమాను ఆమె భర్త ఆదిత్యరాయ్ కపూర్ నిర్మించబోతున్నారు. లాక్ డౌన్ లేకుంటే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమై ఉండేది. ఇందిరాగాంధీ జీవితంపై బోలెడంత రీసెర్చ్ చేయాల్సిరావడంతో .. స్ర్కిప్ట్ రెడీ అయ్యేందుకు ఆలస్యమైందని విద్యాబాలన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి క్వీన్ ఆఫ్ బయోపిక్స్ .. ఇందిరాగాంధీ పాత్రను ఏ రీతిలో పోషించి మెప్పిస్తుందో చూడాలి.
అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?
అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...