మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబుతో పాటు కన్నడ బ్యూటీ కృతిశెట్టి కథాయికగా పరిచయం అవుతుంటే… తమిళ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం.. అనే పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించి సినిమా రిలీజ్ కి ముందే ఉప్పెన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమా చూశారట. ఈ కథను ముందుగా విని ఓకే చేసింది చిరంజీవే. ఇప్పుడు తనకు చెప్పిన కథను ఎలా తీసారో అని ‘ఉప్పెన’ మూవీ చూడడం జరిగిందని తెలిసింది.
సినిమా చిరంజీవికి బాగా నచ్చిందట. తమిళ డైరెక్టర్ భారతీరాజా మార్క్ కనిపించిందని.. హృదయానికి హత్తుకునేలా ఉంది.. చాలా బాగా తీశాడు అంటూ దర్శకుడు బుచ్చిబాబును మెచ్చుకున్నారట. అంతే కాకుండా.. తప్పకుండా ‘ఉప్పెన’ సక్సస్ అవుతుందని చెప్పారని సమాచారం. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. చిరంజీవి ప్రశంసలు దక్కించుకున్న ఉప్పెన ప్రేక్షకుల అభినందలను కూడా అందుకుంటుందని ఆశిద్దాం..
Must Read ;- ’ఉప్పెన‘ బుచ్చిబాబుకి మరో మెగాఆఫర్ ?