తమిళ దళపతి విజయ్, లోకేష్ కనగ్ రాజ్ కలయికలో ‘మాస్టర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈమధ్యనే మాస్టర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో విజయ్ సరికొత్తగా కనిపించాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఎక్కువ మంది వీక్షించిన టీజర్ గా రికార్డు సృష్టించింది.
ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ‘మాస్టర్’ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. రీసెంట్ గా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే మాస్టర్ మూవీకి అనేక ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయని, అందుకు నిర్మాతలు అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ ను నిర్మాతలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారని సమాచారం. కాకపోతే మొదట సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతినిధులు కూడా అంగీకరించారని సమాచారం.
అందుకే మాస్టర్ సినిమా ముందు థియేటర్స్ లో ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న మాట. విజయ్ నటించిన గత చిత్రాలు పెద్ద విజయాలు సాధించడంతో ఈ సినిమాపై విజయ్ భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ రిలీజ్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్టర్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.