అధికారం చేజారిపోకూడదు. ఓటు బ్యాంక్ స్ధిరపడిపోవాలి. తాను జైలు కెళ్లినా.. వెళ్లకపోయినా ఎన్నికలొస్తే మళ్లీ తమ పార్టీయే గెలవాలి. అందుకు ప్రతి ఓటరుకు ఏదో ఒక రూపంలో డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉండాలి. వాళ్లు తమ పార్టీపై అభిమానం చూపించాలి. ఓటు వేయాలి. అదే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు డబ్బులు లేకపోయినా.. అన్ని రకాల ఖాతాల నుంచి డైవర్ట్ చేసి మరీ..ఖర్చు పెడుతోంది. దొరికొన దగ్గరల్లా అప్పులు చేస్తోంది. అందుకు ప్రభుత్వ భూములను సైతం తాకట్టు పెడుతోంది.
కేంద్రం నిబంధనలు కూడా..
తాననుకున్నది నడిపించుకోవటానికి జగన్మోహన్రెడ్డి నిబంధనలను సైతం ఖాతరు చేయటం లేదు. రాష్ట్రంలో నిబంధనలు సరే.. కేంద్రం నిబంధనలు అయినా పాటించాలి కదా..ఇప్పుడు అవి కూడా పాటించడం లేదని బయటపడింది. ఎక్కడబడితే అక్కడ రుణాలు తెచ్చుకుంటూ..వాటికి గ్యారంటీలు ఇచ్చేస్తూ… ఆ వివరాలు మాత్రం కేంద్రానికి ఇవ్వడం లేదు. ఎందుకంటే పరిమితికి మించి అప్పులు చేయడానికి రాష్ట్రానికి అనుమతి లేదు. కేంద్రం విధించిన పరిమితిలోపే అప్పులు చేయాలి. అయితే ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నజగన్ సర్కార్ ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు కేంద్రానికి ఇచ్చే నివేదికల్లో కూడా మ్యాజిక్ చేస్తోంది. మూడేళ్ల రిపోర్టు ఇవ్వమంటే… టీడీపీ హయాంలోని రెండేళ్లు..తమ హయాంలోని ఒక ఏడాది ఇచ్చి.. మరో ఏడాదికి ఎగనామం పెట్టింది.
Also Read ;- 90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ
పరిమితికి మించి..
ఇప్పటికే రుణాలు మూడు శాతానికి మించిపోయాయి. ఇక ఈపీఎఫ్, నాబార్డు, హడ్కోల నుంచి తెచ్చే అప్పులపై కూడా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తోంది ప్రభుత్వం. గత 66 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ష్యూరిటీల విలువ 60 వేల కోట్లు అయితే.. జగన్ వచ్చిన రెండేళ్లలోనే 60 వేల కోట్లకు ష్యూరిటీలిచ్చేశారు. ఇవి కాక లెక్క లేకుండా మరో 21 వేల కోట్లకు ష్యూరిటీలిచ్చేసింది. బడ్జెట్ నిబంధనలతో పని లేదు. తిరిగి ఎలా కట్టాలనే చింత కూడా లేదు. ముందు పనైపోవాలి అంతే.దాని కోసం అడ్డదిడ్డంగా అప్పులు చేసేస్తూ పోతోంది జగన్ ప్రభుత్వం. ఇప్పటికే పరిమితికి మించి అదనంగా లక్ష కోట్ల పైనే అప్పులు చేసేసింది. ఈ విషయంలో కేంద్రంతో పాటు, ఆర్బీఐ కళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పేసింది.
ఆదాయం పెరిగే చర్యలే లేవు..
ఒకవైపు రాష్ట్రంలో ఆదాయం పెరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి.. రియల్ ఎస్టేట్లో అనిశ్చితి తెచ్చిపెట్టారు. దీంతో ఆ ఆదాయమూ పడిపోయింది. కొత్తగా పెట్టుబడులూ రావటం లేదు. కేవలం జీఎస్టీ ఆదాయం మీదే ఆధారపడి…కేంద్రం గ్రాంట్లు..ఇతరంగా ఏ రూపంలో డబ్బులొచ్చినా.. వాటినన్నిటిని వాడేసుకుంటూ కేవలం నవరత్నాలకు డబ్బులిచ్చేస్తున్నారు. అధికారులు నసిగినా వినటంలేదు..మంత్రులు చెప్పినా పట్టించుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి.. ఏమైనా సరే ఆ డబ్బులు జనం అకౌంట్లలోకి పడిపోవాలి. పైగా వేగంగా అమలు కావాలి. ఏ క్షణంలో ఏం జరిగి జైలులోకి వెళతారో తెలియదు కాబట్టి.. చాలా స్పీడుగా ఆ పనులు చేయించాలని వెంటపడుతున్నారు.
అంతా అయ్యాక.. ఆ రుణభారం మొత్తం జనం మీదే పడుతుంది. డబ్బులు అకౌంట్లో పడినవాడు.. పడనివాడు అందరూ వాటిని మోయాల్సిందే. వాటి కోసం ఇప్పుడు ఆస్తి పన్ను వేసినట్లు కొత్త పన్నులు వేస్తారు.. అవన్నీకట్టడానికి.. అకౌంట్లో పడిన డబ్బులకు డబుల్ ఎదురు కట్టాల్సి వస్తుంది. మరి ఆ విషయం లబ్ధిదారులకు అర్ధమవుతుందో లేదో.
Must Read ;- సోదరికే రక్షణ లేకపోతే.. డాక్టర్ సునీతారెడ్డికి ఎవరి నుంచి ప్రాణ హాని?