దివంగత నటీమణి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసత్వాన్ని .. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ అందిపుచ్చుకోగా.. త్వరలోనే రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ ఎంట్రీ కూడా షురూ కాబోతోంది. ఆక్క స్టార్ డమ్ ను చూసి ఇన్స్ పైర్ అయి.. తన తల్లి లెగసీని కంటిన్యూ చేయడానికి తాను కూడా బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అక్క జాన్వీలాగానే ఖుషీ కపూర్ కూడా ఏమాత్రం తీసిపోని అందంతో, కథానాయికకు కావల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఎంట్రీ పై బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.
ఖుషీ కపూర్ న్యూయార్క్ లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకొని తన ఎంట్రీ కోసం రెడీ అయింది. అక్కడ ఏడాది కోర్స్ చేసి వచ్చిందని .. త్వరలోనే ఫిట్ నెస్ లో కూడా శిక్షణ తీసుకొని .. 2022 లో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఖుషీ కపూర్ ను హీరోయిన్ గా లాంఛ్ చేసే సన్నాహాల్లో ఉందని టాక్ . మరి ఖుషీ కపూర్ ఎంట్రీ మూవీని తెరకెక్కించే దర్శకుడు ఎవరవుతారో చూడాలి.
Must Read ;- అతిలోక సుందరి తనయల అన్యోన్య బంధం