రాజ్యం సుభిక్షంగా ఉంటాలంటే శాంతి, భద్రతలు చాలా కీలకం. అందుకే దేశంలో ఏ రోజు ఎన్ని నేరాలు జరిగాయి. వాటి వివరాలను నేర గణాంక శాఖ నమోదు చేస్తోంది. ప్రతి నెలా, ప్రతి సంవత్సరం ముగింపులో ఆ ఏడాది నేరాలు పెరిగాయా? తగ్గాయా? అని విశ్లేషించుకుంటారు. నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ గణాంకాలు ఉపకరిస్తాయి. అంతే కాదు పెట్టుబడులు పెట్టేవారు కూడా సురక్షిత రాష్ట్రాలను ఎంచుకుంటారు. నేరాలు, ఘోరాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురారు. ఆ జాబితాలో ఏపీ చేరిపోయింది. ఏపీలో చంపుకోవడం, నరుక్కోవడం, అత్యాచారాలు, దాడులు, గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఏపీలో శాంతి, భద్రతలు క్షీణించాయని నేరగణాంకాలు రుజువు చేస్తున్నాయి.
అన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఏపీలో వైసీపీ పాలన వచ్చింది మొదలు రౌడీలు చెలరేగిపోతున్నారు. సహజంగా రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా సహజమే. అయితే అవి శృతిమించిపోతున్నాయి. బూతుపురాణాలకు లెక్కేలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజకీయ ముసుగులో ఏపీలో రౌడీలు చెలరేగిపోతున్నారనిపిస్తోంది. రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీలకు స్వేచ్ఛ లభించినట్టయింది. ఏపీలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే పార్టీలతో పనిలేకుండా రౌడీలు, గూండాలు స్వేచ్ఛగా వారి పని వారు చేసుకుపోతున్నారనే అనుమానం కలుగుతోంది.
హత్యలు, అత్యాచారాలు పెరిగాయి
ఏపీలో నేరాల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు కనిపిస్తున్నా, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు మాత్రం పెరిగిపోయాయి. వ్యక్తిగత గొడవలు, ఆస్థి తగాదాల్లో రౌడీలు తలదూరుస్తున్న ఘటనలు ఎక్కువై పోతున్నాయి. పార్టీ ఏదైనా ప్రయివేటు పంచాయితీల్లో రౌడీలు ప్రవేశిస్తే, అవి ముదిరిపోయి తరవాత హత్యలకు దారితీస్తున్నాయి. ఏపీలో అత్యాచారాలు, దళితులపై దాడులు, హత్యలకు లెక్కే లేకుండా పోయింది. అత్యాచారం జరిగితే రూ.5 లక్షలు, అత్యాచారం, హత్య జరిగితే రూ.10 లక్షలు పరిహారంగా ఇచ్చి బాధితుల నోరు మూయిస్తున్న ప్రభుత్వం, ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. బెజవాడలో రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు రెచ్చిపోతున్నా కనీసం సీసీ కెమెరాలు రిపేరు చేయించేందుకు కనీసం రూ.10 లక్షల నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.
పోలీసులకు సంకెళ్లు
పోలీసు వ్యవస్థ స్వేచ్ఛగా పనిచేస్తే వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు స్వేచ్ఛను కోల్పోయారనే విషయం అర్థం అవుతోంది. ఏదైపా ఘటప జరగ్గానే వస్తున్న పోలీసులు, జరిగిన సంఘటనలో ఎవరు ఏ పార్టీ వారు అని ఆరా తీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు అరాచకాలకు పాల్పడ్డా, పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని చాలా కేసుల్లో రుజువైంది. తాజాగా గుంటూరు సమీపంలోని నల్లపాడులో వైసీపీ నేత నాగిరెడ్డి 6 నెలలుగా కరెంటు బిల్లు చెల్లించలేదు. సహజంగా ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించకపోతేనే వైరు కట్ చేస్తారు. కానీ లైన్ మెన్ 5 నెలలు ఆగారు. తాజాగా లైన్ మెన్, వైసీపీ నేత నాగిరెడ్డి ఇంటికి కరెంటు కట్ చేశారు. దీంతో అతనిని నాగిరెడ్డి విచక్షణా రహితంగా కొట్టాడు.
పోలీసులు సకాలంలో వచ్చినా కనీసం నాగిరెడ్డిని ఆపే ప్రయత్నం చేయలేదు. అంటే అధికారం తోడుంటే ఏ అరాచకం చేసినా పోలీసులు చూస్తూ ఊరకుండిపోతున్నారంటే వారి డ్రస్ కు విలువ లేకుండా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలీసులు కళ్ల ముందు అరాచకాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఏపీలో ఇలాంటి ఘటనలు కోకొల్లుగా చోటుచేసుకుంటున్నాయి.
Must Read ;- రగిలిన తా‘ఢి’పత్రి.. జేసీ ఇలాకాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాదాగిరి
తాడిపత్రి ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
ఇటీవల తాడిపత్రిలో 9 మంది గన్ మెన్లతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి వెళితే పోలీసులంతా చోద్యం చూశారు. ఇవన్నీ వీడియోల్లో జనం చూస్తూనే ఉన్నారు. పెద్దారెడ్డి కన్నా ముందే పోలీసులు, గన్ మెన్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి గేట్లు నెట్టుకుని ఇంట్లోకి వెళ్లడం సీసీ కెమెరా విజువల్స్ లో రికార్డయిన దృశ్యాలు చూసిన ఎవరికైనా వారు పోలీసులా లేదంటే వైసీపీ పార్టీ తరపున పనిచేస్తున్న గూండాలా అనే అనుమానం రాక మానదు. సహజంగా అధికార పార్టీకి పోలీసులు కొద్దిగా ఫేవర్ చేస్తారని అనుకుంటూ ఉంటాం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులు మొత్తం నూటికి నూరు శాతం వైసీపీ వారు చెప్పిందే చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు.
అన్యాయం జరిగిన వారికి, బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగు లెత్తుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదే పోలీసులపై వాలంటీర్లు దాడి చేసినా ఉన్నతాధికారులుకానీ, పోలీసు అధికారుల సంఘాలు కానీ నోరు మెదపడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
శాంతి, భద్రతలు క్షీణించాయి
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయనే పదం ఇక్కడ చాలా చిన్నదిగా అనిపిస్తోంది. తాజాగా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను పట్టపగలు వేలాది మంది జనం మధ్యలో నరికి చంపుతున్నా పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, డీజీపీకి లేఖ రాసి 24 గంటలు కాక ముందే మరో హత్య జరగడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇక హత్య ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తూ ఉంటడం చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా అనే అనుమానం వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read ;- జగన్కు ఓటేసి.. ఈ మహిళలు ఏమయ్యారో చూశారా?
చంద్రబాబునాయుడు ఫేస్ బుక్ పోస్ట్ పూర్తి పాఠం :
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ తాడిపత్రి ఘటనపై ముఖ్యమంత్రికి, డిజిపికి లేఖలు రాసి 24 గంటలు దాటకుండానే చేనేత కుటుంబానికి చెందిన నాయకుడు సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేసారుబడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమా? ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు, మానభంగాలు, హింసా విధ్వంసాలతో ఎవరికీ భద్రత లేకుండా పోయింది.వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది చేస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడినందుకు సుబ్బయ్యను హత్య చేస్తారా? రాష్ట్రాన్ని రౌడీలు, హంతకుల చేతిలో పెట్టి పోలీసులు చేతులు ముడుచుకు కూర్చున్నారా? పోలీసులు వెంటనే ఈ హత్యలో వైసీపీ నేతల పాత్రపై ఆరా తీసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి.
Posted by Nara Chandrababu Naidu on Tuesday, December 29, 2020