విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో సూపర్ హిట్టయిన సినిమా విక్రమ్ వేదా. గాయత్రీ పుష్కర్ దంపతులు ఈ సినిమాను రూపొందించారు. కాగా ఈ సినిమాను ఎప్పటి నుంచో వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి మేకర్స్ పోటీ పడుతున్నా.. ఎట్టకేలకు బాలీవుడ్ రీమేక్ కు కేస్టింగ్ ఫిక్సయింది. సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళోబోతోంది. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన గాయత్రీ పుష్కర్ లే హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోలుగా హృతిక్ రోషన్, సైఫ్ ఆలీఖాన్ లు ఖాయమయ్యారు.
విజయ్ సేతుపతి పాత్రలో హృతిక్, మాధవన్ పాత్రలో సైఫ్ నటిస్తూండడం విశేషంగా మారింది. మరి శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రల్లో నటించేది ఎవరో ఇంకా తెలియదు. ఇంకా పేరు పెట్టని హిందీ విక్రమ్ వేదా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?