స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. బన్నీ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. అల.. వైకుంఠపురములో సినిమా పూర్తైన వెంటనే బన్నీ.. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కేరళలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అయితే.. కరోనా రావడంతో అంతా తారుమారు అయ్యింది. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ కేరళలోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
అయితే.. కేరళలో ఈ టైమ్ లో షూటింగ్ చేయడం అంత సేఫ్ కాదని.. షూటింగ్ ని రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లికి మార్చారు. నవంబర్ లో మారేడుమిల్లిలో షూటింగ్ స్టార్ట్ చేసారు. బన్నీతో పాటు ప్రధాన తారాగణం అంతా ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది అనుకుంటే.. టీమ్ మెంబర్స్ లో కొంత మందికి కరోనా వచ్చింది. అంతే.. వెంటనే షూటింగ్ ఆపేసి అందరూ హైదరాబాద్ వచ్చేసారు. పుష్ప షూటింగ్ ఆగినప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారని.. దీనికి సంబంధించి అప్ డేట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
బన్నీ నిహారిక పెళ్లికి ఉదయ్ పూర్ వెళ్లారు. అయితే.. పుష్ప షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ చేయండి అని బన్నీ సుకుమార్ కి, చిత్ర నిర్మాతలకు చెప్పాడట. దీంతో సుకుమార్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారట. తన టీమ్ తో కలిసి తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అయితే.. తదుపరి షెడ్యూల్ ను మారేడుమిల్లిలో కాకుండా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ లో చేయాల్సిన షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే అవుట్ డోర్ షూటింగ్ గురించి ఆలోచిద్దామని బన్నీ చెప్పాడట. అతి త్వరలోనే పుష్ప షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుందని సమాచారం.
Must Read ;- ‘పుష్ప’ సినిమాలో అంతమంది విలన్సా.. నిజమేనా?