బాలీవుడ్ ముగ్ధమనోహర ముద్దుగుమ్మల లిస్ట్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పేరు కియారా అద్వానీ. అమ్మడు ఏం చేసినా సెన్సేషనే. ఎలాంటి షోస్ చేసినా ప్రభంజనమే. అందాలు ఆరబోయడంలో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచించడం ఈ బ్యూటీ స్పెషాలిటీ. వెండితెరపై అయినా.. సోషల్ మీడియాలో అయినా.. ప్లేస్ ఏదైనా.. సరే అమ్మడి సోయగాల ప్రదర్శన తీరు ఒకటే.
ఎర్లియర్ గా బాలీవుడ్ లో ‘ఇందూకీ జవానీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం ‘షేర్షా’ చిత్రాన్ని విడుదలకి రెడీ చేసింది. అలాగే భూల్ బులయ్యా 2. జగ్ జగ్ జియో, మిస్టర్ లేలే లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఎలాంటి పాత్రకైనా తనదైన శైలిలో గ్లామర్ యాడ్ చేసి.. దానికి మరింత బ్యూటీని అద్దుతుంది కియారా. ఇక కియారా హాబీస్ విషయానికొస్తే.. ఆమె తరచుగా స్విమ్మింగ్ కు వెళుతుంటుంది. ఏమాత్రం సమయం చిక్కినా ఈతకొలనులో చేపపిల్లైపోతుంది. ఆమె 2021 న్యూ ఇయర్ వేడుకల కోసం బాయ్ ఫ్ఱెండ్ తో సీక్రెట్ గా మాల్దీవుల విహారానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఇక గోవా బీచ్ కైతే.. ఆమె లెక్కలేనన్ని సార్లు సందర్శించి.. తన సరదా తీర్చుకుంది. ఇటీవల ఆమె ఒక సముద్రంలో చేపపిల్లలా ఈదుతూ ఉన్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో చిచ్చురేపింది. అందమైన రంగురంగుల చేపపిల్లలు ఈదుతుంటుంటే.. వాటితో పోటీ పడుతూ అందాల కియారా కూడా చేపపిల్లైపోయింది. ఆలీవ్ గ్రీన్ బికినీ ధరించి.. కియారా ఈదుతున్న వీడియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఈదుతున్న తీరు చూస్తుంటే.. ఎంతో కాలంగా అక్కడే నివసిస్తున్నట్టు అనిపించడం విశేషం.
Must Read ;- టూ పీస్ బికినీ తొడిగిన బుల్లితెర బుల్లెమ్మ