లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీల్లో సినిమాలకన్నా వెబ్ సిరీస్ ను చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడ్డారు ప్రేక్షకులు. సెన్సార్ లేకపోవడంతో కొన్ని సిరీస్ లు అడల్డ్ కంటెంట్స్ తో నిండిపోవడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే.. కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ‘ఢిల్లీ క్రైమ్’ ఒకటి. ఢిల్లీ నిర్భయా కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఒక బస్సులో రాత్రి సమయంలో ఒక అమ్మాయిని నలుగురు మానభంగం చేసిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రిచీ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు అంతర్జాతీయ అవార్డ్ లభించడం విశేషం. 48వ ఇంటర్నేషనల్ అవార్డుల్లో దీనికి నెట్ ఫ్లిక్స్ బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డ్ లభించింది. ఈ వెబ్ సిరీస్ ను దేశంలోని మహిళలందరికీ అంకితమిస్తున్నట్టు డైరెక్టర్ రిచీ మెహతా తెలిపింది. ఈ వెబ్ సిరీస్ లో పోలీసాఫీసర్ గా నటించిన షిఫాలీషాకి మంచి పేరొచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు అవార్డు వచ్చిన సందర్భంగా ఇందులోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Best Drama Series: #DelhiCrime
Based on the real life Delhi rape case. It took Director Richie Mehta six years to finish his research for this project !!
A proud moment for the country and great achievement for OTT platforms. pic.twitter.com/nxZHVwaojN
— Bitchingfilms Review (@bitchingfilms) November 24, 2020
Must Read ;- క్రిస్మస్ కానుక ఇవ్వబోతున్న మెగా హీరో