బాలీవుడ్ టు హాలీవుడ్ ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది విశ్వసించేది ఐ.యం.డి.బి నే. ఒక రకంగా సినిమా రేటింగ్స్ లో ఐ.యం.డి.బి అంటే.. నాణ్యతలో ఐయస్ఐ మార్క్ లెక్కే. అక్కడ యూజర్స్ అభిప్రాయాన్ని బట్టి రేటింగ్ ఇస్తారు. అందులోని రేటింగ్ ను బట్టే టాప్ చిత్రాల్ని డిసైడ్ చేస్తారు. ఇప్పటివరకూ భారతీయ భాషల్లో విడుదలైన సినిమాలన్నిటిలోనూ అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. అవి కూడా ఇప్పటివరకూ 8.5 రేటింగ్స్ దక్కించుకోలేదు. ఇప్పుడు దాన్ని మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ బ్రేక్ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళ చిత్రం ‘దృశ్యం 2’. ఎలాంటి అంచనాలు లేకుండా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్టైపోయింది. దీనికి ఏకంగా 8.8 రేటింగ్ దక్కడం ఐ.యం.డి.బి చరిత్రలోనే అద్బుతమని చెప్పవచ్చు. మొదటి భాగాన్ని మించి అద్భుత విజయం సాధించిన ‘దృశ్యం 2’ చిత్రం మోహన్ లాల్ అద్భుతమైన నటనకి నిదర్శనంగా నిలిచిపోయింది. అదే దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను తెలుగులోనూ రూపొందిస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ , మీనా జంటగా.. తెలుగులో కూడా దృశ్యం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా టాకీ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ అయింది. మొత్తం 47 రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి దర్శకుడు జీతు జోసెఫ్ రికార్డు సృష్టించారు. అతి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా కూడా ఒరిజినల్ వెర్షన్ స్థాయిలోనే సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. మరి ఐయండిబీ దీనికి ఎంత రేటింగ్ ఇస్తుందో చూడాలి.
Must Read ;- వెంకటేశ్ దర్శకత్వంలో వెంకటేశ్?