బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. కంగనా రనౌత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తలైవి’. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని తమిళ దర్శకుడు ఏ.యల్. విజయ్ తెరకెక్కిస్తున్నాడు. జయలలిత సినీనటి స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమాన్ని .. చాలా ఆసక్తికరమైన రీతిలో చెప్పబోతున్నాడు దర్శకుడు. అలాగే ఇదే కథలో జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రని కూడా అంతే ఇంటెన్సిటీతో పోట్రేట్ చేస్తున్నారు.
నిన్న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా.. ‘తలైవి’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమా ఏప్రిల్ 23న థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఇందులో యం.జీ. రామచంద్రన్ గా తమిళ హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి నటిస్తుండగా.. కరుణానిధిగా ప్రకాష్ రాజ్, శశికళ గా పూర్ణ నటిస్తున్నారు. నార్త్ ఇండియన్ అయినప్పటికీ.. జయలలిత పాత్రను అద్భుతమైన రీతిలో పోషిస్తోంది కంగనా రనౌత్ . మరి ఈ సినిమా ఆమెకు ఏ స్థాయి లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఇందిరా గాంధీగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
To Jaya Amma, on her birthanniversary
Witness the story of the legend, #Thalaivi, in cinemas on 23rd April, 2021. @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms @ThalaiviTheFilm pic.twitter.com/JOn812GajH— Kangana Ranaut (@KanganaTeam) February 24, 2021