బాలీవుడ్ దివంగత యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. తన తోటి నటీనటులకు, కథానాయికలకు ఎన్నో తీపి గురుతులు మిగిల్చి.. తానో జ్ఞాపకం అయిపోయాడు. ఇప్పటికీ అతడ్ని తలచుకొని బాధపడని వారే లేరు. తన మంచి తనంతో ఎందరినో స్నేహితుల్ని చేసుకొని.. తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయి ఇప్పటికీ తీరని వేదనని మిగిల్చాడు. అలాంటి హీరోతో నటించిన .. హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ఎంతో ఎమోషనల్ అయింది. దానికి కారణం ఇద్దరూ కలిసి నటించిన ‘రబ్తా’ చిత్రం జూన్ 9 నాటికి నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా అదే రోజు కృతి ఒక వీడియో పోస్ట్ చేసి.. తన వేదనని అందరితోనూ పంచుకుంది. సుశాంత్ సింగ్ ను తలచుకొని భావోద్వేగానికి గురైన కృతి.. మానవ సంబంధాల్ని బలంగా నమ్ముతాను. మనుషులు ఏదో సాధించడానికే జన్మిస్తారని విశ్వసిస్తాను. దానికి ‘రబ్తా’ చిత్రమే సాక్ష్యం. సుశాంత్, డినో, మడోక్ ఫిల్మ్స్ కలిసిన తీరు ఇప్పటికీ మనసును ఉద్వేగానికి గురి చేస్తుంది. సినిమాలు వస్తుంటాయి,పోతుంటాయి కానీ, ప్రతీ సినిమా ఒక మదురానుభూతిని అందిస్తుంది. మన మధ్య ఏర్పడే కనెక్షన్స్ ను ఒకరికొకరికి ఎమోషనల్ గా మారుస్తాయి. సుశాంత్ దూరమైన తీరుని ఇప్పటికీ తాను జీర్షించుకోలేకపోతున్నానని ఎంతో బాధతో చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- ఎన్సీబీ చక్రబంధంలో సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్