కరోనా మహమ్మారి ఇక్కడ కాస్తంత నెమ్మదించినా.. మహారాష్ట్రలో ఇప్పటికీ ఇంకా తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు వరుసగా దీని బారిన పడుతునే ఉన్నారు. తాజాగా మరో బాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం అభిమానుల్లో ఆందోళన కలగజేస్తోంది. అతడు మరెవరో కాదు రాక్ స్టార్ రణబీర్ కపూర్.
రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ .. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియ జేసింది. రణబీర్ ఇంటి దగ్గరే క్వారంటైన్ లో ఉన్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడి గురించి ఆందోళన చెందిన అభిమానుందరికీ కృతజ్ఞతలు. రణబీర్ తన ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు… అని తెలిపింది. ఇంతకు ముందు రణబీర్ బంధువులు .. అతడు అనారోగ్యం పాలయ్యాడు అని తెలిపింది. కానీ అది కరోనా అని చెప్పలేదు. దాంతో నీతూ దాని పై పూర్తి వివరణ ఇచ్చింది.
Must Read ;- బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత










