గతేడాది మార్చ్ 23 నుంచి కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలల కాలం పాటు.. అన్ని రంగాలూ కుదేలైపోయాయి. అందులో సినీ రంగం కూడా ఒకటి. షూటింగ్స్ జరగక, థియేటర్స్ తెరవక .. అస్తవ్యస్తమైపోయింది. అయితే ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టింది. వేక్సినేషన్ అమల్లోకి వచ్చింది. దీని వల్ల అందరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వేక్సినేషన్ తీసుకుంటూ.. మిగిలిన వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.
మొన్నా మధ్య ప్రధాని మోడి, లోకనాయకుడు కమల్ హాసన్.. ఇంకా తదితర ప్రముఖులు వేక్సినేషన్ తీసుకోగా.. ఇప్పుడు మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కేరళలోని అమృత హాస్పిటల్ లో ఫస్ట్ డోస్ వేక్సిన్ ను వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నారు. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 చిత్రం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆరాట్టు’ అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న మోహన్ లాల్.. దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ తోనే వేక్సినేషన్ తీసుకోడానికి హాస్పిటల్ కు వెళ్ళడం విశేషం.
Must Read ;- ‘దృశ్యం 3’ కి ఆస్కారముందా?










