లాస్ట్ మంత్ 19న మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ .. నటించిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానందుకు అభిమానులు కాస్తంత నిరాశ చెందినా.. సినిమా సూపర్ హిట్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. మోహన్ లాల్ అద్భుతమైన నటన, దర్శకుడి బ్రిలియెన్సీ వెరశి ‘దృశ్యం 2’ సినిమా భాషలకతీతంగా సక్సెస్ ఫుల్ సీక్వెల్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు మరో మెగాస్టార్ మమ్ముట్టి వంతు వచ్చింది. ఈయన కూడా ఇటీవల ఓ థ్రిల్లర్ మూవీతో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టాడు. సినిమా పేరు ‘ది ప్రీస్ట్’. ఈ నెల 11న విడులైన ఈ సినిమాకి కూడా అద్భుతమైన టాక్ వచ్చింది. కొత్త కుర్రోడు జొఫిన్ టి చాకో మలిచిన ఈ హారర్ థ్రిల్లర్ .. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. అనుమానాస్పద రీతిలో ఆత్మ హత్యలు చేసుకుంటూ ఉంటారు ఒక వర్గం ప్రజలు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? దానికి కారణమేంటి? అనే విషయాల్ని పరిశోధన చేయడానికి రంగంలోకి దిగుతాడు ఒక చర్చి ఫాదర్. ఒక పోలీసాఫీసర్ ఈ విషయంలో ఆయనకి అండగా నిలుస్తాడు.
మంజువారియర్ కథానాయికగా నటించింది. థ్రిల్లర్ మూవీస్ తీయడంలో ఎప్పుడూ తాము చాలా ప్రత్యేకం అని మరోసారి మాలీవుడ్ మేకర్స్ నిరూపించారు. విచిత్రమైన గెటప్ లో మమ్మట్టి కనిపిస్తారు ఈ సినిమాలో. మరో పక్క వన్ అనే మూవీలో దీనికి పూర్తి విభిన్నంగా .. ముఖ్యమంత్రి పాత్రలో రాబోతున్నారు మమ్ముట్టి. మరి ‘ది ప్రీస్ట్’ మూవీ లాంగ్ రన్ లో ఇంకెంత గా మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో చూడాలి.
Must Read ;- ట్రైలర్ టాక్ : కేరళ ముఖ్యమంత్రిగా మమ్ముట్టి ‘వన్’