ఆయుష్మాన్ ఖురానా, రాధికా అప్టే, టబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం బాలీవుడ్ మూవీ ‘అంధాధూన్’. ఈ మూవీ ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సక్సస్ సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళంలో కూడా రీమేక్ చేస్తుండడం విశేషం. తెలుగులో నితిన్ ‘అంధాధూన్ రీమేక్’ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తమిళ్ లో ప్రశాంత్ హీరోగా రూపొందుతోంది. మలయాళంలో కూడా రూపొందుతోన్న ఈ ‘అంధాధూన్’ రీమేక్ లో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్నారు. ‘భ్రమం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో రాశిఖన్నా నటిస్తోందని సమాచారం. అమ్మడు తెలుగులో ప్రతిరోజు పండగే సినిమాతో సక్సస్ సాధించింది కానీ.. తదుపరి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా ఇప్పుడు ‘అంధాధూన్’ రీమేక్ తో మరో సారి మలయాళంలోకి అడుగుపెడుతోంది. అంతకు ముందు మోహన్ లాల్ నటించిన ‘విలన్’ చిత్రంతో రాశీ ఖాన్నా మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి మల్లూ ప్రేక్షకుల్ని పలకరించనుండడం ఆసక్తిని రేపుతోంది. రవి కె చంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిన రాశీ ఖన్నాకు మళ్ళీ మాలీవుడ్ నుంచి అవకాశం రావడం అంటే బంపర్ ఆఫరే. ఈ సినిమా కూడా సక్సస్ అయితే.. అక్కడ మరిన్ని అవకాశాలు అంది పుచ్చుకోవడం ఖాయం.
Must Read ;- రాశీఖన్నాపేరు చెబితే భయపడుతున్నాడా?