January 31, 2026 1:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు

వేతన సవరణ నివేదికపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. పీఆర్సీ రిపోర్టు వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.

January 27, 2021 at 3:57 PM
in Editors Pick, Opinion, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మూడు సంవత్సరాలుగా ఎదురుచూపులు చూస్తూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న పిఆర్‌సి రిపోర్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చిలకరించింది. దీంతో ఇంతకాలం ఎంతో ఓర్పుతో ఎదురుచూసిన ఉద్యోగులు ఒక్కసారిగా పి.ఆర్.సి. నివేదికను చూసి భగ్గుమన్నారు. తాము ఎదురుచూసిన ఫలితం దరిదాపుల్లో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు. కేసీఆర్ వ్యవహార సరళిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజా పరిణామాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయడం జరుగుతూ వస్తోంది. గడచిన ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచడం అనేది చాలాకాలంగా జరుగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమిస్తుంది. సాధారణంగా ఏకసభ్య కమిటీగా ఇది రూపొందుతుంది. సదరు ఏకసభ్య కమిటీ గడచిన ఐదేళ్ల కాలంలో సగటు ఉద్యోగి జీవన ప్రమాణాన్ని రకరకాలుగా గమనించి, ఆ ఉద్యోగికి పెరిగిన జీవన వ్యయాన్ని అంచనావేసి, ఏమేరకు ఆ ఉద్యోగికి వేతనం పెరిగితే అతని జీవన ప్రమాణం, ప్రయాణం సజావుగా, నిలకడగా సాగుతుంది అనేవిషయాన్ని అంచనావేసి ఆమేరకు వేతన పెంపును ప్రతిపాదించడం జరుగుతూ వస్తోంది. ఈనేపధ్యంలో ప్రత్యేక రాష్ట్రంగా రూపొందిన తెలంగాణలో అప్పటికే వేతన సవరణ కమిటీ సిఫారసు చేసిన వేతనంకన్నా కొత్త రాష్ట్రం వచ్చిన జోష్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యోగులకు అత్యధిక ఫిట్ మెంట్ ను ప్రతిపాదించారు. ఇది అప్పట్లో మంచి పి.ఆర్.సి గా చెప్పుకోవచ్చు.

Must Read ;- కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారా?

అప్పట్లో రాష్ట్రం కూడా దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే రాష్ట్రం ఏర్పడి, వేతన సవరణ జరిగి కూడా ఐదేళ్లు గడచిపోయాయి. తర్వాత కొత్తగా ఎన్నికలు, అలాగే కొత్తగా వేతన సవరణ చేయాల్సిన సమయం ఆసన్నమయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి భిన్నంగా కనిపించసాగింది. దీంతో ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వం పట్ల కాస్త కినుక కనిపించసాగింది. కొత్త రాష్ట్రం వస్తే ఎందరికో నిరుద్యోగులకు ఉద్యొోగాలు వస్తాయని, అన్ని ఉద్యోగాలు మనవారికే లభిస్తాయని ఇలాంటి ఎన్నో ఆశలను రేకెత్తించి, అధికారంలోకి వచ్చిన తెరాస అధినేత తర్వాత కొత్త కొలువుల విషయాన్ని విస్మరించారు. అలాగే ఉద్యోగుల విషయాన్ని కూడా విస్మరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటూ పలువురు దేవుళ్లు, దేవతలకు పెద్ద పెట్టున మొక్కులు మొక్కుకున్నారు. ఈ మొక్కులను తీర్చుకోవడంలోనే వేల కోట్లు ఖర్చుపెట్టేశారు. అయితే ఈ మొక్కులన్నీ కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసమేనా… లేక తాము అధికారంలోకి రావడంకోసమా… అనేది కూడా సగటు తెలంగాణ ప్రజలకు అనుమానం రావడం కద్దు. ఏది ఏమైనా… కొత్తలో ధనిక రాష్ట్రంగా వుంటూ వచ్చిన తెలంగాణ తర్వాత పేద రాష్ట్రంగా రూపు సంతరించుకోవడం మొదలుపెట్టింది.

ఈ నేపధ్యంలో గడవుకన్నా ముందుగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి, కేసీఆర్ ఎన్నికలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు కూడా పెద్ద ఎరనే వేశారు. అసలు వేతన సవరణ చేయడానికి నెలలు, సంవత్సరాలు అవసరం లేదని, కేవలం రెండే నెలల్లో వేతన సవరణ చేసి, ఉద్యోగులకు వేతనాలు పెంచేస్తానంటూ ఎన్నికల్లో వాగ్దానం చేశారు.

Also Read ;- కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!

కానీ తొలినాట ఉద్యోగులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చెప్పాలి. అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామంటూ అదికూడా 61 సంవత్సరాలకు పెంచేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇలా పలు వాగ్దానాలు చేశారు. కానీ వీటిలో ఏవీ నెరవేరిన దాఖలాలు కనిపించకపోవడంతో సహజంగానే అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు ఇద్దరూ కూడా తెరాస పట్ల విముఖత చూపించారు. ఉద్యోగులు పనిగట్టుకుని మరీ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకుని తమ వ్యతిరేకతను ఓటు ద్వారా తెలిపారు. దీంతో కినుక వహించిన కేసీఆర్ ఇక అప్పటినుండి తన ఆగ్రహాన్ని అణచుకుంటూ, ఉద్యోగుల పట్ల మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించనారంభించారు. రెండు నెలలకే పి.ఆర్.సి. నివేదికను అందివ్వమంటూ నియమించిన త్రిసభ్య కమిటీ మూడేళ్లయినా నివేదికను అందివ్వకపోవడం దీనికి నిదర్శనం.

అయితే ఉద్యోగులు కూడా ఏమీ భయపడలేదు. తమ వ్యతిరేకతను ఏదోరకంగా తెలుపుతూనే వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్ల ప్రభావం బాగానే పడిందని చెప్పవచ్చు. ఫలితంగా అప్పటి వరకూ కేవలం ఒక్క ఎమ్మెల్యే సంఖ్యతో ఉన్న బిజెపికి మరో సంఖ్య పెరిగింది. దీంతో తెరాస వర్గం ఆలోచనలో పడింది. ఇదేసమయంలో అటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా తెరాసను కలవరపెట్టాయి. దీంతో పాపం తెరాసకు మెట్టు దిగక తప్పలేదు. అయితే అప్పటికే రకరకాల పథకాల నిర్వహణ నేపధ్యంలో ఖజానా ఖాళీ అయింది. దీంతో ఇప్పుడు వేతన సవరణ జరిగితే పెరిగే భారాన్ని భరించడానికి తెలంగాణ ఖజానా సిద్ధంగా లేదు. మరోవైపు నాగార్జున సాగర్ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి మరోసారి తెరపైకి పి.ఆర్.సి. ని తీసుకువచ్చారు.

Also  Read ;- కేసీఆర్‌కి నిరుద్యోగుల పరీక్ష.. పదవీ విరమణ వయస్సు పెంపుపై మల్లగుల్లాలు

కొత్త సంవత్సరం 2వ తేదీన ఉద్యోగులకు తీపి కబురు అంటూ పత్రికాముఖంగా ప్రకటనలు గుప్పించారు. దీంతో పత్రికలు కూడా ఈ విషయాన్ని పెద్ద పెట్టున ప్రచారం చేశాయి.

ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్న సామెత చందంగా అసలు పి.ఆర్.సి. నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించనేలేదు… కానీ అప్పుడే ఉద్యోగులకు తీపి కబురు అంటూ ప్రకటనలు. దీంతో సాధారణ ప్రజలు ఉద్యోగులకు జీతాలు పెరిగేశాయే…! అనుకోనారంభించారు. కానీ ఇప్పటిదాకా దాని అంతూ పొంతూ లేదు. చివరికి ఉద్యోగులు ధర్నాలు చేశారుకూడా. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి కదలిక కనిపించలేదు. చివరికి కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని బహిరంగ పరచడానికి మరో పదిహేను రోజులు. ఇలా దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన వేతన సవరణ కమిటీ నివేదిక ఎట్టకేలకు బహిర్గమయింది. అయితే ఈ నివేదిక ఉద్యోగుల జీతాలను పెంచి, వారి జీవితాలను సంతోషమయం చేసేదిగా కనిపించకపోగా… ఇప్పటికే ఉన్న జీతాలను తగ్గించి, వారి జీవితాలను అగమ్యగోచరంగా తయారుచేసేదిగా ఉంది.

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 27 శాతం ఐ.ఆర్. ఇచ్చి ఉద్యోగులు ఆనందంగా తమ ఉద్యోగాలను చేసుకుంటున్నారు. దీంతో పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంత ఇచ్చినపుడు ధనిక రాష్ట్రమైన తమ తెలంగాణలో మరింత పెరుగుదల ఉంటుందని ఇంతకాలంగా ఉద్యోగులు ఉవ్విళ్లూరుతూ వచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించనంత తక్కువ ఫిట్మెంట్ ను ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను సమర్పించింది. దీంతో జీతం పెరిగినాకూడా ఇప్పటికే కరోనా కారణంగా భారీగా పెరిగిన ధరల వల్ల అతలాకుతలం అవుతున్న సగటు ఉద్యోగి జీవితం ఈ వేతన పెంపువల్ల ఎలాంటి లాభం కలుగకపోగా… వేతనం మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా ఉంది.

ఎందుకంటే ఈ నివేదికలో ఉద్యోగులకు ఇస్తూన్న హెచ్.ఆర్.ఎ. ను తగ్గించాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది. దీంతో ఉద్యోగులకు వచ్చే వేతనంలో కోత విధించక తప్పదు. పెరిగిన జీతంలో సగభాగం తరుగుడుకే సరిపోతుంది. ఇక పెరిగినా పెరగకపోయినా పెద్ద తేడా కనిపించదు. దీంతో ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read ;- కేసీఆర్‌కూ.. PK సహాయం కావాల్సిందేనా..!

మరోవైపు ఉద్యోగులను చాకచక్యంగా తనవైపుకు తిప్పుకోవడానికి అపర చాణుక్యుడైన కేసీఆర్ ముందస్తు చర్యగా కమిటీని తక్కువ వేతన పెంపును సిఫారసు చేయమని సూచించి, తర్వాత తాను ఎంతో ఉదార స్వభావుడిని అని ఉద్యోగులు పొగడుతూ, పాలాభిషేకాలు చేయడానికి సిద్ధపడేలా వేతన పెంపును సూచించినా ఆశ్చరపోవాల్సిన పనిలేదు. లేదా ఖజానాలో నిధుల లేమిని గురించి కమిటీకి సూచించి, ఆమేరకు వేతన పెంపును సిఫారసు చేయాల్సిందిగా కమిటీకి ముందుగానే సూచనలు చేసివుండవచ్చని పలువురు ఉద్యోగులు భావిస్తున్నారు. ఏదిఏమైనా వేతన సవరణ సంఘం సూచించిన వేతన పెంపు నిజంగా ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు.

మరోవైపు ఉద్యోగులకు పెన్షన్ ను లేకుండా చేసి, కేవలం కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం ప్రవేశపెట్టి, ఉద్యోగుల వేతనంలో కొంతమేర మినహాయించి, ఉద్యోగి పదవీ విరమణ అనంతరం దాన్ని ఉద్యోగికి అందజేయడం అనే పద్ధతిని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఉద్యోగి వేతనంలో పదిశాతం మేరఉంటూ వస్తోంది. తాజాగా వేతన సవరణ కమిటీ సిఫారసులో ఇది 14 శాతం మేర ఉండాలంటూ సూచించడంతో సి.పి.ఎస్. ఉద్యోగులు విస్తుపోతున్నారు. తమకు వేతనం పెరిగినా కూడా అసలు పెరుగుదల కూడా కనిపించదంటూ వాపోతున్నారు.

ఈ నివేదికలో మరో చిత్రం ఏమిటంటే… గత రెండు సంవత్సరాల కాలంటో సగటు తెలంగాణ ఉద్యోగి జీవన వ్యయం భారీగా తగ్గిందంటూ కొన్ని నివేదికలు సూచించడం గమనార్హం. ఇలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వేతన సవరణ కమిటీ వేతన పెంపును సిఫారసు చేసివుంటే అది పూర్తిగా తప్పు అనే చెప్పాలి. గత ఏడాది కాలంలా కరోనా మహమ్మారి కారణంగా సాధారణ ఉద్యోగి స్థాయి నుండి పెద్దస్థాయి ఉద్యోగుల వరకు జీవన వ్యయం పెరిగింది అని చెప్పక తప్పదు. సరకుల రవాణా నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు బాగానే పెరిగాయి. దీనికితోడు వేతనంలో కోత విధించడంతో ఉద్యోగి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఫలితంగా అతని జీవన వ్యయాన్ని మరింతగా తగ్గించుకుంటూ వచ్చాడు. దీని ఫలితంగానే సగటు ఉద్యోగి జీవన వ్యయం తగ్గిందని చెప్పవచ్చు. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని వేతన సవరణ కమిటీ వేతన సవరణను సిఫారసు చేసివుంటే అది అర్థరహితం అని చెప్పవచ్చు. మరోవైపు ఉద్యోగుల పిల్లల చదువులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం ఫీజు రీయింబర్స్మెంట్ ను కూడా రద్దు చేస్తే బాగుంటుందంటూ కమిటీ నివేదిక ఇవ్వడం మరింత హాస్యాస్మదంగా కనిపిస్తోంది. మొత్తానికి వేతన సవరణ కమిటీ నివేదిక ఉద్యోగికి ఆనందాన్ని కలిగించాల్సింది పోయి ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి భారాన్ని కలిగించాల్సిన నివేదిక ఖర్చును తగ్గించేదిగా కనిపిస్తోంది. ఏదిఏమైనా వేతన సవరణ కమిటీ సూచించిన వేతన పెంపు మాత్రం ఉద్యోగులకు నీరసాన్ని కలిగించిందనే చెప్పవచ్చు!!

Also Read ;- ‘కేసీఆర్ ఏక పక్ష ధోరణి’.. ఎండగట్టేందుకు కోదండ‌రాం దీక్ష

Tags: ck kcrcm kcrkcrkcr meetingkcr press meetLatest Telangana Political Newstelangana cmtelangana cm kcrTelangana CM NEWStelangana employeestelangana employees uniontelangana employees union about kcrtelangana employees union leadertelangana employees union newstelangana latest newstelangana newsTelangana Politicaltelangana political newsTelangana Politics
Previous Post

ఆస్కార్ బరిలో సూర్య ‘సూరా‌రై పోట్రు’

Next Post

విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?

Related Posts

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

by లియో డెస్క్
January 25, 2026 7:20 pm

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ...

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

by లియో డెస్క్
January 24, 2026 8:44 pm

పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని...

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

by లియో డెస్క్
January 24, 2026 5:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే...

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

by లియో డెస్క్
January 17, 2026 5:15 pm

ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!

సత్యదేవ్, తమన్నా మధ్యలో ‘లై’ గాళ్

వేగేశ్న సతీష్.. అప్పుడే సినిమా కంప్లీట్ చేసేశారా.?

ముఖ్య కథనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist