బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాధే. ఈ సినిమాలో దిషా పటాని కథానాయికగా నటించింది. ఇందులో రణదీప్ హుడా.. జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా కొరియన్ ఫిల్మ్ కి రీమేక్. కరోనా కారణంగా సినిమా బిజినెస్ ఎలా జరుగుతుంది.? రిలీజ్ చేస్తే జనాలు వస్తారా..? లాభాలు పక్కనపెడితే.. అసలు పెట్టుబడి అయినా వస్తుందా..? అనుకుంటుంటే.. ఈ మూవీకి భారీ డీల్ సెట్ అయ్యింది.
ఇంతకీ విషయం ఏంటంటే..సల్మాన్ రాథే మూవీని జీ స్టూడియో 230 కోట్లకు కొనడం హాట్ టాపిక్ గా మారింది. శాటిలైట్.. థియేట్రికల్ (ఇండియా + ఓవర్సీస్).. రైట్స్ సహా డిజిటల్ హక్కులు మ్యూజిక్ హక్కులను ఓవరాల్ గా ఇంత పెద్ద మొత్తానికి జీ స్టూడియో కొన్నట్టు తెలిసింది. కరోనా టైమ్ లో ఇది అతిపెద్ద డీల్ అని చెప్పచ్చు. ఈ డీల్ తో సల్మాన్ కి టేబుల్ ప్రాఫిట్ లభించింది. అయితే… జీకి ఇంత పెద్ద మొత్తంతో ఈ సినిమాని కొనడం రిస్క్ కాదా అంటే.. కాదనే చెప్పచ్చు. ఎందుకంటే.. సల్మాన్ సినిమాలకు డిమాండ్ బాగా ఉంది.
ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా అలాగే టీవీల్లో చూడడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది అనేది అంచనా. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా వైఆర్ఎఫ్ కమీషన్ ప్రాతిపదికన థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు అది జీ స్టూడియోస్ వశమవుతుంది. దీని వలన కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉది. ఇలా.. ఏరకంగా చూసుకున్న జీ స్టూడియోకు లాభమే వస్తుంది. ఏది ఏమైనా.. కరోనా టైమ్ లో ఇంత పెద్ద డీల్ జరగడం విశేషం.
Must Read ;- సంచలనానికి మరోపేరు సల్మాన్ (బర్త్ డే స్పెషల్)